Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Vasireddy Padma Counter To Janasena Chief Pawan Kalyan

Vasireddy Padma: పవన్‌ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు

Published Date :July 27, 2023 , 3:31 pm
By Mahesh Jakki
Vasireddy Padma: పవన్‌ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vasireddy Padma: ఏపీలో మహిళల మిస్సింగ్‌లపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్లకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకటన చేశారని.. దానిపై పవన్ వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు. భారీ స్థాయిలో మహిళల అదృశ్యమయ్యారన్న ఆయన.. మహిళల అదృశ్యంలో ఏపీ దేశంలో 11వ స్థానంలో ఉందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించటం లేదని ఆమె ప్రశ్నించారు. రాజ్యసభ ఎందుకు ఏపీలో మహిళల అదృశ్యంపైనే ఎందుకు ఎక్కువ ఆందోళన చెందుతోందన్నారు. ఏపీనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆమె పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్లనే ఏపీలో మహిళల అదృశ్యం అంటున్న పవన్.. ప్రేమ వ్యవహారాల వల్లనే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారని తెలుసుకోవాలన్నారు. ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా అంటూ ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు అంటూ మండిపడ్డారు. తప్పిపోయిన వారిలో 70 శాతం వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించాలని అనుకోవటం లేదని ప్రశ్నించారు.

“ఒక క్రిమినల్ కహానీ అల్లి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమా హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా??. మాకు చాలా విషయాలు ప్రశ్నించాలని ఉంది. కనిపిస్తే, ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది. సభ్యత ఉంది కనుకే నోటీసులు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పరు. పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి. మహిళా కమిషన్ అంటే పవన్ కళ్యాణ్‌కు చులకన భావం. వాలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యం అవుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ ఆధారాలు బయటపెట్టాలి. రికవరీ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. భరణం ఇచ్చి వదిలించుకుంటాం అంటే ఏ ఒక్క మహిళ అయినా అంగీకరిస్తుందా?. వాలంటీర్ల క్యారెక్టర్‌పై మాట్లాడుతున్నారు కనుక మేం కూడా ప్రశ్నిస్తున్నాం. మహిళల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి, మాకు ఎంతో చిత్తశుద్ధి ఉంది.” అని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.

Also Read: Minister KTR: మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద మూసి నదిని పరిశీలించిన మంత్రి కేటీఆర్

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల మిస్సింగ్‌పై రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికల అదృశ్యంపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఇచ్చిన సమాచారంపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. పార్లమెంట్‌ సాక్షిగా నిజాలు వెల్లడయ్యాయని తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు అద్యశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో మన అమ్మాయిలు, మహిళలు ఎందుకు మిస్సింగ్ అవుతున్నారని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని నిలదీశారు. ఈ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేపు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతారా అని పవన్ కళ్యాణ్ బుధవారం ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోం శాఖను, డీజీపీని మహిళా కమిషన్ డిమాండ్ చేస్తుందా అని నిలదీశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశంలో మాట్లాడడం గమనార్హం. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ఆమె విరుచుకుపడ్డారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • AP Womens Commission Chairperson
  • janasena
  • pawan kalyan
  • vasireddy padma

తాజావార్తలు

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

  • Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్

  • Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?

  • Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!

  • Gangavva: ప్రజావాణికి మై విలేజ్ షో గంగవ్వ.. అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions