Minister KTR: మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద మూసి నదిని పరిశీలించిన మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద మూసి నదిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో వరద పరిస్థితిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సహాయక చర్యలుచేపట్టాలని మంత్రి సూచించారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, సహాయక చర్యలు చేపట్టలని ఆదేశించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదని తెలిపారు. అత్యవసర సహాయం కోసం అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. మూసీనదికి ఎక్కువ మోతాదులో నీరు చేరాయని మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద నీరు ఏరులై పారుతుందని కానీ.. ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎటువంటి సహాయక చర్యలకు అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాన్ని లెక్క చేయకుండా మూసారం బాగ్ బ్రిడ్జి పరివాహన ప్రాంత ప్రజలను స్వయంగా మంత్రి కేటీఆర్ కలిసి ధైర్యం చెప్పారు.
Read also: Samantha : మంకీతో సెల్ఫీ దిగుతున్న సమంత..
Also Read
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- OTR : కొందరు 'దరిద్రుల' వల్లే పార్టీ మారా!: పోచారం
- HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
- Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
హైదరాబాద్లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్కు వరద పోటెత్తుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వర్షాకాలం రాకముందే కాల్వలు పూడికతో నిండిపోయాయని అన్నారు. చెరువుల్లో నీటి మట్టం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. నగరంలో ఎస్ఆర్డిపి అమలుకు ముందు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విపక్షాలు వీలైతే సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వర్షాలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో 14 వంతెనలు మంజూరయ్యాయని కేటీఆర్ తెలిపారు.
Moranchapally: మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం
తాజావార్తలు
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!