Vande Bharat Train : తెలంగాణలో పరుగుల పెట్టనున్న వందే భారత్ ట్రైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ట్రైన్ తెలంగాణలోనూ పరుగులు పెట్టనుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఈ వందే భారత్ ట్రైన్ను ప్రారంభించారు. అయితే.. తాజాగా తెలంగాణకు సైతం ఓ వందే భారత్ ట్రైన్ను కేటాయించింది సౌత్ సెంట్రల్ రైల్వేకు తొలి రైలును రైల్వే బోర్డు. అయితే.. వందేభారత్ ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ నుంచి ఏ మార్గంలో నడిపించాలనే విషయంపై పరిశీలన చేస్తోంది రైల్వేబోర్డు. అత్యంత ఆధునిక, వేగవంతమైన రైలు అయినప్పటికీ వందేభారత్ రైళ్లలో బెర్తులు ఉండకపోవడంతో.. ఎక్కువ దూరం ప్రయాణం కాకుండా ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగిసేలా దీని రూటును ఖరారు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గరిష్ఠంగా 10 గంటల్లోపే చేరే గమ్యస్థానాలను అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read : Most Polluted Cities: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కాలుష్య నగరాలు ఇవే.. టాప్లో వైజాగ్..
అయితే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖ, బెంగళూరు, ముంబాయి వంటి నగరాలకు ఎక్కువ రద్దీ ఉన్న నేపథ్యంలో.. సికింద్రాబాద్ నుంచి ఈ మార్గాల్ని రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు. విశాఖ వైపు ప్రతిరోజు పదికి పైనే రైళ్లు అందుబాటులో ఉన్నా.. అంత ఈజీగా రిజర్వేషన్ దొరకకపోవడం నిదర్శనం. అయితే.. ఇక తిరుపతి వెళ్లే వారైతే.. నెల రోజుల ముందే రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు రైలు కంటే బస్సుల్లోనే రెండు గంటల ముందు గమ్యస్థానాలకు చేరుకుంటుండటంతో వారు బస్సులవైపే ఆసక్తి చూపుతున్నారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ తయారయ్యే వందేభారత్ ఎక్స్ప్రెస్లకు గరిష్ఠంగా 180 కిమీ వేగంతో ప్రయాణిస్తాయి. ఇప్పటివరకు నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్లు పరుగుల పెడుతున్నాయి. సెప్టెంబరు 29న గాంధీనగర్-ముంబై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును గాంధీనగర్లో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!