Most Polluted Cities: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కాలుష్య నగరాలు ఇవే.. టాప్లో వైజాగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) తాజాగా దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది… ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు సిటీలకు చోటు దక్కింది.. ముఖ్యంగా ఉమ్మడి ఏపీ రాజధాని, ప్రస్తుత తెలంగాణ రాజధాని హైదరాబాద్తో పాటు.. ఏపీలో కేపిటల్ సిటీగా చెబుతున్న విశాఖపట్నం కూడా ఉన్నాయి.. సీపీబీటీ తాజా నివేదిక ప్రకారం.. విశాఖపట్టణంలో గాలి నాణ్యత తక్కువగా అంటే 202 పాయింట్లుగా ఉండగా.. అనంతపురంలో 145 పాయింట్లు.. హైదరాబాద్లో 100 పాయింట్లు, తిరుపతిలో 95 పాయింట్లు, ఏలూరులో 61 పాయింట్లుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది..
Read Also: Nitin Gadkari: దేశం ఆయనకు రుణపడి ఉంది.. మన్మోహన్ సింగ్పై నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు
Also Read
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
ఇక, సీపీసీబీ మంగళవారం విడుదల చేసిన అత్యంత కాలుష్య నగరాల జాబితాలో బీహార్లోని కతిహర్ టాప్ స్పాట్లో నిలిచింది.. కతిహర్లో గాలి నాణ్యత (ఏక్యూఐ) 360 పాయింట్లకు పడిపోగా.. ఢిల్లీ (354 పాయింట్లు), నోయిడా (328), ఘజియాబాద్ (304) నగరాలు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.. బిహార్లోని బెగుసరాయ్, హరియాణాలోని బల్లాబ్గఢ్, ఫరిదాబాద్, కైతాల్, గురుగ్రామ్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లను కూడా కాలుష్య నగరాలుగా పేర్కొంది సీపీసీబీ.. మొత్తంగా భారతదేశంలో వాయు కాలుష్య స్థాయిలు 2022లో మరింత దిగజారింది.. ఈ డేటా భారతదేశానికి మేల్కొలుపుగా చెబుతారు.. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) పంజాబ్లో బుధవారం నాడు 3,634 పొలాల్లో మంటలు చెలరేగినట్లు నివేదించింది, ఇది ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధికంగా పేర్కొంది..
మరోవైపు, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా ముఖ్యమంత్రులకు రాజధాని సరిహద్దుల్లో ట్రాఫిక్ జామ్లను నివారించడానికి పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వేలపై అనవసరమైన వస్తువులను రవాణా చేసే ట్రక్కులను మళ్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ పరిధిలోని సఫర్ అనే అంచనా ఏజెన్సీ ప్రకారం, రవాణా స్థాయి గాలులు అననుకూలమైన కారణంగా ఢిల్లీలోని పీఎం2.5 కాలుష్యం శుక్రవారం 30 శాతం నుండి శనివారం 21 శాతానికి పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లేదా AQI PM 2.5 స్థాయిల సాంద్రతను కొలుస్తుంది.. 2.5 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే సూక్ష్మ కణాలు రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులు మరియు గుండెలోకి చొచ్చుకుపోతాయి.. ఇవి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!