Vaibhav Suryavanshi: గ్రౌండ్ ఏదైనా సరే వీరబాదుడే.. U19లో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల డైనమైట్..!
Vaibhav Suryavanshi: ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న భారత్ అండర్-19 జట్టు సంచలనాలను సృష్టిస్తోంది. తాజాగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన నాలుగవ వన్డేలో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. వర్సెస్టర్ లోని న్యూ రోడ్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో అతను కేవలం 52 బంతుల్లో శతకం చేసి అండర్-19 వన్డే క్రికెట్లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. 14 ఏళ్ల వయసులోనే ఓపెనింగ్ బ్యాటర్గా ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. తనలోని అసాధారణమైన ఆత్మవిశ్వాసం, దూకుడు, టైమింగ్తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
Read Also:IND vs ENG: విజయం ముంగిట భారత్.. లాంఛనమే మిగిలిందా..?
Also Read
- Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
- Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
- Kitchen Tips: మీ పెనం నల్లబడిందా..? ఏళ్ల మసి నిమిషాల్లో మాయం.. కొత్తదానిలా మెరిపించే సూపర్ చిట్కాలు..!
- E Challan: ట్రాఫిక్ ఈ చలాన్లపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..
ఈ ఇన్నింగ్స్ లో మొదట కేవలం 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, ఆ తర్వాత మరో 28 బంతుల్లోనే శతకం పూర్తీ చేసాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ రాల్ఫీ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికే ఈ చరిత్రాత్మక శతకాన్ని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 10 బౌండరీలు, 7 సిక్సర్లు బాదాడు. ఈ ఘనతతో అతను 2022లో శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ చేసిన పాకిస్థాన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇక భారత ఆటగాళ్లలో గతంలో వేగవంతమైన సెంచరీ 69 బంతుల్లో చేసిన రాజ్ అంగద్ బావా పేరిట ఉంది.
బీహార్ లో జన్మించిన వైభవ్ ఈ సిరీస్లో ఇప్పటికే మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ సిరీస్ లో అతను తొలి మ్యాచ్లో 19 బంతుల్లోనే 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అలాగే రెండో మ్యాచ్లో 45(34), మూడవ మ్యాచ్ నార్తాంప్టన్లో 31 బంతుల్లోనే 6 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 86 పరుగులు చేశాడు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఈ రికార్డు బ్రేకింగ్ శతకం ద్వారా వైభవ్ ప్రపంచానికి తన ప్రతిభను చూపాడు. ఈ మ్యాచ్ లో అతను మొత్తంగా 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సహాయంతో భారీ 143 పరుగులను చేశాడు.
Read Also:Auto on Railway Track: రైల్వే ట్రాక్ పై ఆటో పరుగులు.. వేగంగా దూసుకొచ్చిన రైలు.. చివరకు
వర్సెస్టర్ వేదికగా జరిగిన నాలుగో యువ వన్డేలో భారత్ అండర్-19 జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ అండర్-19 జట్టు 45.3 ఓవర్లలో 308 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.
1⃣4⃣3⃣ runs
7⃣8⃣ deliveries
1⃣3⃣ fours
🔟 Sixes 💥14-year old Vaibhav Suryavanshi registered a century off just 52 deliveries, the fastest 💯 in U19 and Youth ODIs 🔥🔥
Scorecard – https://t.co/1UbUq20eKD#TeamIndia pic.twitter.com/ymXf3Ycmqr
— BCCI (@BCCI) July 5, 2025
తాజావార్తలు
-
RCB vs GT: చితక్కొట్టిన సాయి సుదర్శన్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
-
Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
-
SRH Captain: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్.. ఫిట్నెస్ టెస్ట్ పాసయిన కమిన్స్.. రేపే జట్టులోకి ఎంట్రీ..
-
Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
-
Dangers of AC: ఏసీలు వాడుతున్నారా.? ఈ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోండి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!