Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Uttam Kumar Reddy On Fine Rice Distribution Telangana

Uttam Kumar Reddy : మూడు కోట్ల మందికి నాణ్యమైన సన్న బియ్యం.. దేశంలోనే మొదటి సారి

Published Date :April 10, 2025 , 4:33 pm
By Gogikar Sai Krishna
  • దొడ్డు బియ్యం దారి తప్పింది – అందుకే సన్న బియ్యం వైపు అడుగులు
  • MLA లపై కీలక బాధ్యత – నేరుగా పర్యవేక్షణ చేయాలి
  • ప్రజల ఇంటిలో భోజనం చేసి తెలుసుకోవాలి : ఉత్తమ్‌
Uttam Kumar Reddy : మూడు కోట్ల మందికి నాణ్యమైన సన్న బియ్యం.. దేశంలోనే మొదటి సారి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uttam Kumar Reddy : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం దేశవ్యాప్తంగా మరెక్కడా లేని విధంగా విస్తృతంగా కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పథకాన్ని పూర్తి పర్యవేక్షణతో నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. “ఇది సామాన్య ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే గొప్ప కార్యక్రమం. మూడు కోట్ల మందికి ప్రతి నెలా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణే. దేశంలో ఎక్కడా ఇటువంటి పథకం అమలులో లేదు,” అని మంత్రి తెలిపారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నట్లు, గతంలో సరఫరా చేస్తున్న దొడ్డు బియ్యం పేదలకు చేరకపోవడం వల్లనే ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఎంపిక చేసిందని తెలిపారు. “అది మధ్యలోనే దారి మళ్లి, అసలు లబ్దిదారులకు చేరకుండా తేడా వచ్చింది. అందుకే ఈసారి సన్న బియ్యాన్ని తీసుకువచ్చాం,” అని వివరించారు. ఈ పథకం విజయవంతం కావాలంటే, ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పథకం అమలును దగ్గర నుండి పర్యవేక్షించాల్సిందే అని మంత్రి స్పష్టం చేశారు. “సన్న బియ్యం పేదలకు న్యాయంగా అందేలా చూసే బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిదే,” అని అన్నారు.

Also Read

  • Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్‌తో ఆగరు అంతే..
  • Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
  • Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
  • Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..

ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విశేష సూచన చేశారు: “ప్రతి ప్రజాప్రతినిధి, ఒక్కసారి అయినా సన్న బియ్యం తీసుకునే లబ్దిదారుల ఇంటిలో భోజనం చేయాలి. అప్పుడే వారు తినే అన్నం నాణ్యత ఎలా ఉందో తెలిసి వస్తుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం రేషన్ సరఫరాగా కాకుండా, ఆహార భద్రతకు సంకేతంగా తీసుకుంటోంది. అన్ని శాఖల సమన్వయంతో సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు, లోపాలు లేకుండా చూడటం, అధికారుల కర్తవ్యం అని మంత్రి తెలిపారు.

అంతేకాకుండా.. ‘సన్నబియ్యం విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా తిప్పికొట్టాలి. గతంలో సంవత్సరానికి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశాం. ఇప్పుడు 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 49 వేల కార్డులే ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు 30 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కలెక్టర్లు పరిశీలిస్తున్నారు. ప్రతీ అర్హునికి రేషన్ కార్డును అందిస్తాం.’ అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

Xiaomi QLED TV X Pro: క్వాంటం డాట్ టెక్నాలజీ, 4K రిజల్యూషన్‌ లో 43, 55, 65 అంగుళాల టీవీలను విడుదల చేసిన షియోమీ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fine rice scheme
  • MLA Responsibility
  • Public Distribution
  • telangana government
  • telangana news

తాజావార్తలు

  • Easy Mango Lassi Recipe: క్షణాల్లో అదిరిపోయే మామిడి లస్సీ.. ఒక్క గ్లాస్‌తో ఆగరు అంతే..

  • Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..

  • Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..

  • Darling Re-release: రీ-రిలీజ్‌లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!

  • OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions