CAA: సీఏఏపై అమెరికా గాయని ప్రశంసల వర్షం.. ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CAA: భారత్లో అమలవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అమెరికా గాయని మేరీ మిల్బెన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. విశ్వాసం కారణంగా చిత్రహింసలకు గురైన ప్రజల పట్ల ప్రధాని మోడీ దయతో కూడిన దృక్పథాన్ని అవలంబిస్తున్నారని, వారికి భారత్లో నివాసం కల్పిస్తున్నారన్నారు. సీఏఏ నిజమైన చర్య అని కూడా ఆమె పేర్కొన్నారు. మత స్వేచ్ఛను కోరుకునే క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు ఇది శాంతి మార్గం అని అమెరికన్ గాయని అన్నారు. ప్రధానమంత్రి మూడవసారి తిరిగి ఎన్నికైనప్పుడు, అమెరికా ఏకగ్రీవంగా మెరుగైన ప్రజాస్వామ్య భాగస్వామి కావాలనే లక్ష్యంతో ఉండాలన్నారు. పౌరసవరణ చట్టం నిజమైన ప్రజాస్వామ్య చర్య అని పేర్కొన్నారు.
భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది, అయితే ఇది అమెరికాకు ఇష్టం లేదు. దానిపై అభ్యంతరం దాఖలు చేస్తోంది. అయితే అమెరికాకు భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. మార్చి 11 నుండి పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్ గురించి మేము ఆందోళన చెందుతున్నామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పారు. ఈ చట్టం ఎలా అమలు చేయబడుతుందో నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. మత స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు సమానమైన చట్టాన్ని అందించడం ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రమని ఆయన అన్నారు.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
Read Also: Yogi Adityanath: రాజకీయాలను నేరపూరితం చేయడాన్ని ఎప్పటికీ అనుమతించం..
ఇదిలా ఉండగా.. భారత్ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి హక్కుల విభాగాలు ఈ చట్టం అమలును మతవివక్ష అంటూ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఇందులో ముస్లింలను మినహాయించడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
డిసెంబర్ 31, 2014 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు, బౌద్ధులు వంటి ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని సీఏఏ అందిస్తుంది. వలసదారులకు పౌరసత్వం కోసం దరఖాస్తు అర్హత 11 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది. సీఏఏ భారత ముస్లింల పౌరసత్వాన్ని హరించదని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?