US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Trade: అమెరికా విధించే భారీ టారిఫ్లు (పన్నులు) తప్పించుకోవడానికి చైనా ఆడుతున్న ఒక పెద్ద డ్రామాను అమెరికా తాజాగా బయటపెట్టింది. చైనా తయారుచేసిన ఉత్పత్తులను నేరుగా కాకుండా, వేరే దేశాల ద్వారా రూట్ మార్చి అమెరికాలోకి పంపుతున్నారని ఒక నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. దీనికి “షాడో ట్రాన్స్-షిప్మెంట్ నెట్వర్క్” అని పేరు పెట్టిన అమెరికా, ఈ జాబితాలో భారతదేశంతో పాటు మరో 40కి పైగా దేశాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేసింది. ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో “ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్” పేరిట విడుదల చేసిన ఈ నివేదిక అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. 2018లో ట్రంప్ ప్రభుత్వం చైనీస్ వస్తువులపై ‘సెక్షన్ 301’ కింద భారీ టారిఫ్లను విధించిన తర్వాత ఈ అక్రమ రవాణా మరింత ఎక్కువైందని నవారో స్పష్టం చేశారు. ఈ విధంగా రూట్ మార్చి జరుగుతున్న అక్రమ వ్యాపార విలువ ఏటా దాదాపు $40 బిలియన్ల నుంచి ఏకంగా $303 బిలియన్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
ఏళ్ల తరబడి కమ్యూనిస్ట్ చైనా తన ఉత్పత్తులను దాదాపు 40కి పైగా దేశాల ద్వారా రీ-లేబులింగ్, రీ-ప్యాకేజింగ్, రీ-ఇన్వాయిసింగ్ లేదా చిన్నపాటి ప్రాసెసింగ్ చేయించి, ఆ దేశాల్లో తయారైనట్లు రంగు పూసి అమెరికా మార్కెట్లలోకి చొరబెడుతోందని పీటర్ నవారో వివరించారు. ఈ అక్రమ నెట్వర్క్లో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామ్య దేశాలైన మెక్సికో, కెనడా, ఈయూ (యురోపియన్ యూనియన్), భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా భాగమయ్యాయని ఆరోపించారు. చైనా కంపెనీలు చౌకైన కూలీలు, బలహీనమైన కస్టమ్స్ నిబంధనలు ఉన్న దేశాలను, ఫ్రీ ట్రేడ్ జోన్లను అడ్డుపెట్టుకుని తమ వస్తువులకు కొత్త “నేషనల్ ఆరిజిన్” ముద్ర వేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
Also Read
ఈ నివేదికలో భారత్లోని పుణే-గుజరాత్-చెన్నై పారిశ్రామిక ప్రాంతాన్ని అమెరికా ప్రత్యేకంగా ప్రస్తావించింది. చైనాకు చెందిన పంప్లు, కంప్రెసర్లు ఈ భారతీయ రీజియన్లోకి వచ్చి, అక్కడ చిన్నపాటి మార్పులు చేసుకుని భారతీయ ఉత్పత్తులుగా అమెరికాలోకి అడుగుపెడుతున్నాయని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల యుఎస్లోని సిన్సినాటి, డేటన్, కొలంబస్ వంటి ప్రాంతాల్లోని అమెరికన్ ఉత్పత్తుల విక్రయాలు దారుణంగా దెబ్బతింటున్నాయని నవారో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ సవాలును తిప్పికొట్టేందుకు అమెరికా ఇప్పుడు కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ఆయుధాన్ని రంగంలోకి దించుతోంది. “డిటెక్టివ్ బోర్డర్” అనే అత్యాధునిక AI సిస్టమ్ను అమెరికన్ కస్టమ్స్ విభాగంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఏఐ సిస్టమ్ ఉత్పత్తుల షిప్మెంట్ డేటా, ప్రయాణించిన మార్గాలు, ప్రొడక్ట్ క్లాసిఫికేషన్స్, కంపెనీల యాజమాన్య లింకులు, ఉత్పత్తి సామర్థ్యాలను నిశితంగా విశ్లేషిస్తుంది. ఏవి నిజమైన పెట్టుబడులో, ఏవి చైనా అక్రమ మార్గాల్లో పంపుతున్న వస్తువులో ఈ AI పక్కాగా గుర్తిస్తుంది. అంతేకాకుండా, ఇటువంటి అక్రమ షిప్మెంట్లను అడ్డుకుని, భారీ పెనాల్టీలు విధించడం మరియు ఆయా వస్తువులను అమెరికాలోకి రాకుండా శాశ్వతంగా నిషేధించడం ఈ సిస్టమ్ ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!