UP: మహిళపై గ్యాంగ్ రేప్, బాధతో ఆత్మహత్య.. పోలీసులు ఏం చేశారంటే..?
- ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో గ్యాంగ్ రేప్ కు గురైన మహిళ సూసైడ్
- ఈ కేసును గ్యాంగ్ రేప్ కింద చేర్చడానికి పోలీసులు నిరాకరణ
- ఆత్మహత్యకు ప్రేరేపించే సెక్షన్ల కింద కేసు
- ఈ కేసుపై మండిపడుతున్న జనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో సామూహిక అత్యాచారానికి గురై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే.. ఈ కేసును ఎఫ్ఐఆర్లో గ్యాంగ్ రేప్ కింద చేర్చడానికి పోలీసులు నిరాకరించారు. దానికి బదులుగా ఆత్మహత్యకు ప్రేరేపించే సెక్షన్లను జోడించారని మృతురాలి తండ్రి చెప్పాడు. దీంతో.. ఈ కేసుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. అత్యాచార ఘటన ఆగస్టు 17న జరిగింది. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు ఊరి నుంచి బయటకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఓ పాఠశాల సమీపంలో పడేసి వెళ్లిపోయారు. కాగా.. బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో.. వెంటనే తండ్రి అక్కడికి చేరుకుని మహిళను ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం.. ఆ మహిళ తన కుటుంబానికి జరిగిందంతా చెప్పింది. అయితే.. కొన్ని గంటల తర్వాత బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది.
Indra 4K: బద్దలు కొడుతుంది అనుకుంటే ‘మురారి’ని టచ్ చేయలేదుగా!
Also Read
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
ఈ ఘటనపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అయితే పోలీసులు మాత్రం గ్యాంగ్ రేప్ కేసుకు బదులు, ఆత్మహత్య కేసు నమోదు చేశారని తండ్రి తెలిపాడు. కాగా.. గ్యాంగ్ రేప్ ఆరోపణలపై కేసు నమోదు చేయడానికి నిరాకరించిన సబ్ ఇన్స్పెక్టర్ను తన పోస్ట్ నుండి తొలగించారు. అంతేకాకుండా.. అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాగా.. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని ఆగస్టు 19న అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడిని మరుసటి రోజు అరెస్టు చేశారు.
Maharashtra polls: సీఎం పోస్టుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
అయితే.. అరెస్టు సమయంలో ఇద్దరు నిందితులు పోలీసు జీపులో నుండి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుల కాళ్లు విరిగిపోయాయి. మరొక నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్తే.. తమపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. కాగా.. పోలీసులు జరిపిన ప్రతీకార కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్యామ్ దేవ్ తెలిపారు. అనంతరం.. ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!