UP: మహిళపై గ్యాంగ్ రేప్, బాధతో ఆత్మహత్య.. పోలీసులు ఏం చేశారంటే..?
- ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో గ్యాంగ్ రేప్ కు గురైన మహిళ సూసైడ్
- ఈ కేసును గ్యాంగ్ రేప్ కింద చేర్చడానికి పోలీసులు నిరాకరణ
- ఆత్మహత్యకు ప్రేరేపించే సెక్షన్ల కింద కేసు
- ఈ కేసుపై మండిపడుతున్న జనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో సామూహిక అత్యాచారానికి గురై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే.. ఈ కేసును ఎఫ్ఐఆర్లో గ్యాంగ్ రేప్ కింద చేర్చడానికి పోలీసులు నిరాకరించారు. దానికి బదులుగా ఆత్మహత్యకు ప్రేరేపించే సెక్షన్లను జోడించారని మృతురాలి తండ్రి చెప్పాడు. దీంతో.. ఈ కేసుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. అత్యాచార ఘటన ఆగస్టు 17న జరిగింది. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు ఊరి నుంచి బయటకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఓ పాఠశాల సమీపంలో పడేసి వెళ్లిపోయారు. కాగా.. బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో.. వెంటనే తండ్రి అక్కడికి చేరుకుని మహిళను ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం.. ఆ మహిళ తన కుటుంబానికి జరిగిందంతా చెప్పింది. అయితే.. కొన్ని గంటల తర్వాత బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది.
Indra 4K: బద్దలు కొడుతుంది అనుకుంటే ‘మురారి’ని టచ్ చేయలేదుగా!
Also Read
ఈ ఘటనపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అయితే పోలీసులు మాత్రం గ్యాంగ్ రేప్ కేసుకు బదులు, ఆత్మహత్య కేసు నమోదు చేశారని తండ్రి తెలిపాడు. కాగా.. గ్యాంగ్ రేప్ ఆరోపణలపై కేసు నమోదు చేయడానికి నిరాకరించిన సబ్ ఇన్స్పెక్టర్ను తన పోస్ట్ నుండి తొలగించారు. అంతేకాకుండా.. అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాగా.. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని ఆగస్టు 19న అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడిని మరుసటి రోజు అరెస్టు చేశారు.
Maharashtra polls: సీఎం పోస్టుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
అయితే.. అరెస్టు సమయంలో ఇద్దరు నిందితులు పోలీసు జీపులో నుండి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుల కాళ్లు విరిగిపోయాయి. మరొక నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్తే.. తమపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. కాగా.. పోలీసులు జరిపిన ప్రతీకార కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్యామ్ దేవ్ తెలిపారు. అనంతరం.. ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..