Maharashtra polls: సీఎం పోస్టుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
- సీఎం పోస్టుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
- తమ పార్టీలో ఎవరికీ ఆసక్తి లేదని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వసన్నద్ధం అవుతున్నాయి. ఓ వైపు ఎన్డీఏ కూటమి.. ఇంకో వైపు ఇండియా కూటమి పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అయితే ఎన్నికలకు వెళ్లే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై NCP-SCP నాయకుడు శరద్ పవార్ మాట్లాడుతూ.. తమ పార్టీలో ఎవరికీ ఆసక్తిలేదని తేల్చేశారు. రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని భావిస్తున్నామని.. మార్పు రావాలని కోరుకుంటున్నామని.. కాబట్టి సీఎం ఎవరవుతారన్నది తమ ప్రశ్న కాదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sri Lanka-New Zealand: శ్రీలంక-న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ 6 రోజులు.. కారణమేంటంటే..?
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ఇక ఉద్ధవ్ థాకరే కూడా ఇటీవల స్పందిస్తూ ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినా అభ్యంతరం లేదని.. సపోర్టు చేస్తామని తెలిపారు. మొత్తానికి ఇండియా కూటమిలో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే ఉద్ధవ్ థాకరే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను కలిసి వచ్చారు. సీట్ల పంపకాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Pak Army: సాంకేతిక లోపం కారణంగా పాక్ లోకి ప్రవేశించిన భారత్ డ్రోన్.. పాక్ సైన్యం ఏం చేసిందంటే?
వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడమే తమ లక్ష్యమని శరద్ పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పు జరగగానే సుపరిపాలన అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇక మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేలే.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చారు. ఇక ఎంఐఎం కూడా ఇండియా కూటమిలో చేరేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ముస్లిం ఓట్లు కూడా అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మజ్లి్స్ సపోర్టుతో ఇండియా కూటమి పోటీ చేయనుంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. అదే జోష్.. అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!