Payal Shankar : అణిచివేత ప్రజా పాలన అవుతుందా..?
- భూముల అమ్మకాలపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన పాయల్ శంకర్
- ధరణి, భూమాత.. భూ దందాలో మార్పేమీ లేదు!
- భూముల వేలాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలి : పాయల్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payal Shankar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ భూ విక్రయ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ముఖ్యంగా యూనివర్శిటీ భూముల అమ్మకంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన పరిస్థితులను చూస్తుంటే, కేసీఆర్ అహంకారం ఇప్పుడు రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందని పాయల్ శంకర్ అన్నారు. నాడు ఎంపీగా ఉన్నప్పుడు ‘ప్రభుత్వ భూములు అమ్మకూడదు’ అని చెప్పిన రేవంత్ రెడ్డి, నేడు ఏ అధికారంతో భూములను అమ్ముతున్నారు? అంటూ నిలదీశారు.
వేల ఎకరాల భూములను నాడు కేసీఆర్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, ఇప్పుడు అదే విధానం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు పాయల్ శంకర్. రాష్ట్రాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలంటే భూములను అమ్మడం తప్పని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు పాయల్ శంకర్.
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
పాయల్ శంకర్ వ్యాఖ్యానిస్తూ, ‘‘ధరణి పేరుతో కేసీఆర్ భూ దోపిడీ చేశాడు. ఇప్పుడు భూమాత పేరుతో కాంగ్రెస్ భూ దందాకు తెరలేపుతోంది.’’ ‘‘యూనివర్శిటీ భూములు ప్రభుత్వానివే కాకపోతే, అవి ఎవరివి? విద్యా సంస్థలకు సంబంధించిన భూములను అమ్మకానికి పెట్టడం ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు.
‘‘యూనివర్శిటీ భూములపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని హెచ్సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ) వెళ్లినప్పుడు పోలీసులు మమ్మల్ని నిర్బంధించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలా అణిచివేత పాలన సాగిస్తారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యూనివర్శిటీ భూముల అమ్మకంపై రాజ్యసభలో కూడా ప్రస్తావించాం. భూముల లెక్కలు బయటపెట్టే వరకు బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ భూముల విక్రయ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి’’ అని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
CM Chandrababu: వారసత్వంగా నాకు రూ.10 లక్షల కోట్ల అప్పు వచ్చింది..!
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..