Payal Shankar : అణిచివేత ప్రజా పాలన అవుతుందా..?
- భూముల అమ్మకాలపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన పాయల్ శంకర్
- ధరణి, భూమాత.. భూ దందాలో మార్పేమీ లేదు!
- భూముల వేలాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలి : పాయల్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payal Shankar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ భూ విక్రయ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ముఖ్యంగా యూనివర్శిటీ భూముల అమ్మకంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన పరిస్థితులను చూస్తుంటే, కేసీఆర్ అహంకారం ఇప్పుడు రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందని పాయల్ శంకర్ అన్నారు. నాడు ఎంపీగా ఉన్నప్పుడు ‘ప్రభుత్వ భూములు అమ్మకూడదు’ అని చెప్పిన రేవంత్ రెడ్డి, నేడు ఏ అధికారంతో భూములను అమ్ముతున్నారు? అంటూ నిలదీశారు.
వేల ఎకరాల భూములను నాడు కేసీఆర్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, ఇప్పుడు అదే విధానం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు పాయల్ శంకర్. రాష్ట్రాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలంటే భూములను అమ్మడం తప్పని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు పాయల్ శంకర్.
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
పాయల్ శంకర్ వ్యాఖ్యానిస్తూ, ‘‘ధరణి పేరుతో కేసీఆర్ భూ దోపిడీ చేశాడు. ఇప్పుడు భూమాత పేరుతో కాంగ్రెస్ భూ దందాకు తెరలేపుతోంది.’’ ‘‘యూనివర్శిటీ భూములు ప్రభుత్వానివే కాకపోతే, అవి ఎవరివి? విద్యా సంస్థలకు సంబంధించిన భూములను అమ్మకానికి పెట్టడం ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు.
‘‘యూనివర్శిటీ భూములపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని హెచ్సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ) వెళ్లినప్పుడు పోలీసులు మమ్మల్ని నిర్బంధించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలా అణిచివేత పాలన సాగిస్తారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యూనివర్శిటీ భూముల అమ్మకంపై రాజ్యసభలో కూడా ప్రస్తావించాం. భూముల లెక్కలు బయటపెట్టే వరకు బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ భూముల విక్రయ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి’’ అని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
CM Chandrababu: వారసత్వంగా నాకు రూ.10 లక్షల కోట్ల అప్పు వచ్చింది..!
తాజావార్తలు
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!