Rammohan Naidu: కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్టానికి ఏమి చేస్తాడు.. జగన్ పై ఫైర్
- తిరుపతిలో కేంద్రమంత్రి రామ్మోనాయుడు పర్యటన
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు
- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో కేంద్రమంత్రి రామ్మోనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విమానాల్లో బాంబు బెదిరింపులపై మంత్రి స్పందించారు. గత 9 రోజులుగా చాలా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.. వాటిని చాలా సీరియస్గా తీసుకున్నాంమని తెలిపారు. బెదిరింపులు ఎక్స్ వేదికగా వస్తున్నాయి.. కానీ అవన్నీ ఫేక్ అని తెలుతున్నాయని అన్నారు. ఏవియేషన్, హోంశాఖ కలసికట్టుగా పనిచేస్తున్నాయని.. త్వరలోనే ఇలాంటి వాటికి అంతం పలుకుతామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. బెదిరింపు కాల్స్ చేసే వారికి, బెదిరిస్తూ సోషల్ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జైలు శిక్ష విధించేలా చట్టపరమైన మార్పులు తీసుకువస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అలాంటి వారికి మళ్ళీ విమానంలో తిరిగే అవకాశం లేకుండా చేయాలని చట్టం తెస్తున్నాంమని చెప్పారు.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు
Also Read
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
- Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
- AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
ఓ ఫేక్ కాల్లో ముంబై పోలీసులు ఓ మైనర్ బాలుడ్ని పట్టుకున్నారు.. అతని స్నేహితుడుపై కోపం అతను అలా చేశాడని విచారణలో తెలిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. చాలా మంది ఫ్రాంక్ కిందా చేస్తున్నారా లేక కుట్ర ఏమైనా ఉందా అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ తరువాత బయటికి వస్తుందని చెప్పారు. మరోవైపు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని దుయ్యబట్టారు. కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి జగన్.. ఇక రాష్టానికి ఏమి చేస్తాడని ప్రశ్నించారు. కుటుంబానికి ఏం న్యాయం చేశాడో జగన్ మొదటిగా చెప్పాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.
Read Also: IND vs NZ 2nd Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్
తాజావార్తలు
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!