Kishan Reddy: మోడీ ప్రభుత్వంలో దేశంలో అభివృద్ధి పరంగా అనేక మార్పులొచ్చాయి..
- ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది- కిషన్ రెడ్డి
- అధికారంతో.. ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీ సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమే
- సిద్ధాంతపరంగా.. కార్యకర్తల ఆధారంగా ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ- కిషన్ రెడ్డి
- నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఘనత మోదీది- కిషన్ రెడ్డి
- గత ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేశారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికారంతో, ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీ సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు. సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ అని అన్నారు. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత నరేంద్ర మోడీదని కొనియాడారు. మోడీ ప్రభుత్వంలో దేశంలో అభివృద్ధి పరంగా అనేక మార్పులొచ్చాయని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని దుయ్యబట్టారు.
Ram Charan : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఎప్పటినుండంటే..?
Also Read
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించాలని కుట్ర చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కిషన్ రెడ్డి తెలిపారు. జమ్మూ కశ్మీర్లో దేశ వ్యతిరేక శక్తులను పెంచిపోషించేందుకు వీలుగా ఉన్న ఆర్టికల్ 370ని తొలగించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసి, బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు హక్కులు కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదని ప్రశంసించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కూడా సాధించలేదు.. కానీ, రాహుల్ ప్రధానమంత్రి అయినట్లు ఊహాగానాల్లో తేలిపోయారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో మొదటిసారిగా చూస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అసహనంతో పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అబద్ధాలు, తప్పుడు ఆరోపణలతో విషం చిమ్మారని వ్యాఖ్యానించారు. దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే కాంగ్రెస్ ఉద్దేశమని మండిపడ్డారు.
Anagani Satya Prasad: త్వరలోనే గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్..
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగలేదు.. కానీ, బిజెపిపై మెజారిటీ సాధించిందని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకు కారణం మజ్లిస్ పార్టీతో కుమ్మక్కవ్వడమేనని ఆరోపించారు. మతోన్మాద శక్తులు ఏకమై బీజేపీని ఓడించే ప్రయత్నం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేది కాంగ్రెస్ పార్టీ.. కాని, బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసింది మజ్లిస్ పార్టీ అని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం, కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోతుందని దేశ ప్రజలు గ్రహించారన్నారు.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణచివేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్లో బాంబుపేలుళ్లతో ప్రజలు వణికిపోయారని తెలిపారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపడుతుందని చెప్పారు. లోక్ సభ జరగకుండా అడ్డుపడటం.. రాజ్యాంగం గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరించేందుకు సిద్ధమైంది.. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కిషన్ రెడ్డి కోరారు.
తాజావార్తలు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!