Sanchar Saathi portal: ‘సంచార్ సాథీ పోర్టల్’ ప్రారంభం.. ఇన్ని ప్రయోజనాలున్నాయా..?
Sanchar Saathi portal: కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. సంచార్ సాథీ పోర్టల్ను ప్రారంభించారు.. వర్చువల్ పద్ధతిలో విజయవాడ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కార్యాలయం నుంచీ ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అధికారులు.. అయితే, ఈ పోర్టల్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఒకొక్కరి పేరు మీద ఎన్ని సిమ్ లు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది.. మొబైల్ ఫోన్ ల ద్వారా చేసే నేరాలను అరికట్టడానికి సంచార్ సాథీ పోర్టల్ వినియోగించనున్నారు.. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ.. సీఈఐఆర్ అనేది సంచార్ సాథీ పోర్టల్కు మొదటి అంశంగా పేర్కొన్నారు. ఫోన్ పోయినప్పుడు ఫోన్ బ్లాక్ చేయడానికి సంచార్ సాథీ పోర్టల్ వినియోగించవచ్చు అన్నారు. డిజిటల్ ఐడెంటిటీ కోల్పోకుండా చూడటం కూడా ఒక అంశంగా పేర్కొన్న ఆయన.. Know Your Mobile రెండవ ఫీచర్గా ఇచ్చామన్నారు.
Read Also: DK Shivakumar: సీఎం పదవిపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
మీ పేరుతో ఎన్ని ఫోన్ నంబర్లు.. ఎక్కడెక్కడ దేశంలో తీసుకున్నారో కూడా తెలుసుకోవచ్చని తెలిపారు అశ్వనీ వైష్ణవ్.. వినయోగదారుడికి తెలీకుండా వేరెవరైనా ఫోన్ నంబరు తీసుకుంటే వెంటనే దానిని తీసివేసే అవకాశం కూడా ఉంటుందన్నారు.. నేరం చేయడానికి తీసుకునే ఫోన్ నంబర్లు తీసుకున్నా, ఫోటో మార్చి నంబర్ తీసుకున్న తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.. 87 కోట్ల మొబైల్ ఫోన్లపై కనెక్షన్లను పరిశీలిస్తే.. 42 లక్షల మోసపూరిత కనెక్షన్లు కనుగొని, 36 లక్షల కనెక్షన్లు రద్దు చేశామని వెల్లడించారు. మూడు విధాలైన సంస్కరణలతో సంచార్ సాథీ పోర్టల్ తీసుకొచ్చామని.. లొకేషన్ కనుక్కోవడం మాత్రమే కాకుండా లీగల్ విధానంలో ఒక ఫోన్ ను పనిచేయకుండా చేయచ్చు.. IMEI నంబరు సరైనదేనా అని కూడా ఇందులో కనుక్కోవచ్చు.. భారత టెలికాం సెక్టార్ను గ్లోబల్ లీడర్ గా చేయడయమే మా లక్ష్యంగా తెలిపారు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్.
Read Also: The Kerala Story: 150 నాటవుట్… 200 గ్యారెంటీ
అంటే.. ఇకపై మీ మొబైల్ ఫోన్ కనిపించలేదని కంగారుపడాల్సిన అవసరం లేదు, పోయిందని బాధ పడాల్సిన పని లేదు.. మీ ఫోన్ ఎక్కడ ఉన్నా క్షణాల్లో అదెక్కడ ఉందో ఇట్టే సంచార్ సాథీ పోర్టల్ ద్వారా కనిపెట్టేయొచ్చు. ఈ ‘సంచార్ సాథీ’ అనే వెబ్ పోర్టల్ను సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ – CDOT రూపొందించింది. ముంబై, డిల్లీ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలలో సహా కొన్ని టెలికాం సర్కిల్లలో ఇప్పటికే CEIR సిస్టమ్ను CDOT అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమైంది సర్కార్.. ఇప్పటివరకు ఈ పోర్టల్ సాయంతో 4.70 లక్షల మిస్సింగ్ మొబైల్ ఫోన్లను బ్లాక్ చేశారు. 2.40 లక్షల ఫోన్లను ట్రాక్ చేశారు. 8 వేల మొబైళ్లను రికవరీ చేశారు.
తాజావార్తలు
-
LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్ఎస్జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!
-
Super Over Stats: సూపర్ ఓవర్లోని రన్స్, వికెట్లను బ్యాట్స్మెన్, బౌలర్ ఖాతాలో ఎందుకు కలపరు? ప్రధాన కారణాలు
-
Kara Movie Trailer: ధనుష్ ‘కర’ ట్రైలర్ రిలీజ్..
-
Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!
-
EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!