DK Shivakumar: సీఎం పదవిపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar Interesting Comments on CM Post In Delhi: ‘కర్ణాటక సీఎం పీఠం ఎవరికి దక్కుతుంది?’ ఈ మిస్టరీని తేల్చేందుకు ఢిల్లీలోని హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ని ఢిల్లీ పిలిపించారు. దీంతో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనని, సిద్ధరామయ్యని చెరో రెండేళ్లపాటు సీఎం పదవిని పంచుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు. అసలు అలాంటి ప్రతిపాదన తమ ముందుకు రాలేదన్న ఆయన.. ఇద్దరు కలిసి పంచుకోవడానికి సీఎం పదవి ఏమీ వారసత్వ ఆస్తి కాదని స్పష్టం చేశారు. అలాగే.. సిద్ధరామయ్యకు 80 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న వార్తలపై స్పందిస్తూ.. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 135 అని, దీన్ని ఎవరు విడగొట్టలేరని తేల్చి చెప్పారు. అసలు ఎమ్మెల్యేల మద్దతు గురించి అంత కచ్చితంగా సంఖ్య ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు.
New Zealand: న్యూజిలాండ్ హాస్టల్ భవనంలో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి.. 11 మంది గల్లంతు
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
కాగా.. కర్ణాటక సీఎం విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా, అందుకు తాను కట్టుబడి ఉంటానని డీకే శివకుమార్ ఇదివరకే క్లారిటీ ఇచ్చేశారు. తాను ఎమ్మెల్యేలను విడగొట్టనని, వెన్నుపొటు అస్సలు పొడవనని, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడనని తేల్చి చెప్పారు. చరిత్రలో తనపై ఎలాంటి మచ్చ ఉండకూడదని తాను కోరుకుంటున్నానని, చెడ్డపేరుతో వెళ్లాలని అనుకోవడం లేదని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్కు 20 సీట్లు తేవడమే తమ ముందున్న తదుపరి లక్ష్యమని తెలిపారు. మరోవైపు.. కర్ణాటక సీఎం ఎంపికపై చర్చించేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మంగళవారం ఉదయం బేటీ అయ్యారు. ఢిల్లీ చేరుకున్న డీకేతోనూ కాంగ్రెస్ అధిష్ఠానం చర్చలు జరపనుంది. ఇద్దరితో చర్చలు జరిపిన అనంతరం.. సీఎం ఎవరనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దరామయ్యవైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
Pawan Khera: డీకే, సిద్ధరామయ్యల మధ్య భేదాభిప్రాయాలు లేవు.. పవన్ ఖేరా స్పష్టత
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!