Jharkhand: దారుణం.. మేకను దొంగిలించారని ఇద్దరు యువకులను కొట్టి చంపారు?
- జార్ఖండ్లో దారుణ ఘటన
- మేకను దొంగిలించేందుకు యువకుల యత్నం
- వారిని కొట్టి చంపిన గ్రామస్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో దారుణం చోటు చేసుకుంది. తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని చకులియా పోలీస్ స్టేషన్ పరిధి జోడ్సా గ్రామంలో మేకను దొంగిలించారనే ఆరోపణతో ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఈ ఘటనలో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
READ MORE: Anna Hazare: మద్యం దుకాణాలతో కేజ్రీవాల్ దారి తప్పారు..
Also Read
- Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
- Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
అసలేం జరిగిందంటే.
చకులియా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోడ్సా గ్రామానికి చెందిన హరగోవింద్ నాయక్ ఇంటికి మేకలను దొంగిలించడానికి ఇద్దరు యువకులు వచ్చారు. దొంగిలించేందుకు యత్నిస్తుండగా.. మేక మెడలో కట్టిన గంట మోగింది. వెంటనే హరగోవింద్ నాయక్ మేల్కొన్నాడు. బయటకు వచ్చేసరికి ఇద్దరు యువకులు బైక్ పై మేకను తీసుకెళ్తున్నట్లు చూశాడు. ఆ ఇద్దరు దొంగలను వెంబడించి పట్టుకున్నాడు. ముగ్గురి మధ్య ఘర్షణ మొదలైంది. ఇది విన్న గ్రామస్థులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు దొంగలను కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బలకు 30 ఏళ్ల కిషుక్ బెహెరా అక్కడికక్కడే మరణించాడు. మరో యువకుడు భోలానాథ్ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతులనుని చకులియాలోని జిరాపాడ నివాసులుగా గుర్తించారు.
READ MORE: CM Revanth Reddy: పార్టీ నేతలకు సీఎం క్లాస్.. నేను చేసేది చేసినా ఇక మీ ఇష్టం
ఈ విషయంలో రూరల్ ఎస్పీ రిషబ్ గార్గ్ మాట్లాడుతూ.. ” మేకను దొంగిలిస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత గ్రామంలోని వ్యక్తులు వారిని కొట్టారు. ఈ క్రమంలో వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం. మరికొందరిని అరెస్టు చేయడానికి పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.” అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
-
God of War: పాపం త్రివిక్రమ్.. మళ్ళీ కథ మార్చాల్సిందేనా?
-
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
-
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
-
Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్కు మాస్ ట్రీట్!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!