Womens Marriage: ముస్లిం యువకులు హిందువులుగా నటిస్తూ మోసం చేశారు.. అందుకే ఒక్కటయ్యాం..!
- ఉత్తరప్రదేశ్ లోని బదాయూన్ జిల్లాలో అసాధారణ ఘటన
- పెళ్లి చేసుకున్న యువతులు
- ముస్లిం యువకులు హిందువులుగా నటిస్తూ మోసం చేసారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens Marriage: ఉత్తరప్రదేశ్ లోని బదాయూన్ జిల్లాలో అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఆలయంలో వీరు ఒకరికి ఒకరు పూలమాలలు మార్చుకొని, జీవితాంతం కలిసే ఉండాలని ప్రమాణాలు చేసుకున్నారు. అలాపూర్ పట్టణానికి చెందిన ఆశ అనే యువతి, సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన జ్యోతి అనే యువతిని పెళ్లి చేసుకుని తన భార్యగా అంగీకరించింది. ఆశ తన పేరును కూడా ‘గోలూ’గా మార్చుకున్నది. ఆశ ప్రస్తుతం ఢిల్లీలోని పశ్చిమ విహార్ ప్రాంతంలోని ఓ బేబీ కేర్ సెంటర్లో పనిచేస్తోంది. ఆమెకు ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లున్నారు.
Read Also: Michael Rubin: పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది..
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ఇక జ్యోతి ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని దేరాదూన్లో ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డ్గా పనిచేస్తోంది. ఆమెకు ఓ చెల్లెలు ఉంది. సుమారు మూడు నెలల క్రితం జిల్లా కోర్టు ప్రాంగణంలో వీరిద్దరి పరిచయం జరిగింది. ఆ తరవాత మాట్లాడుకోవడం ద్వారా ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగింది. అలా చివరికి జీవితాంతం కలిసి ఉండాలన్న నిర్ణయం తీసుకున్నారు.
Read Also: AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో సిట్ కస్టడీలోకి సజ్జల శ్రీధర్ రెడ్డి..
ఇక ఈ ఘటన తర్వాత వీరు మాట్లాడుతూ.. ముస్లిం యువకులు హిందువులుగా నటిస్తూ మమ్మల్ని మోసగించారు. ఆ మోసం తెలిసిన తర్వాత మేము మానసికంగా బాగా క్షోభించాం. అప్పటి నుంచి మాకు మగవాళ్లపై నమ్మకం లేకుండా పోయింది. అందుకే ఒకరినొకరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మేము భార్యాభర్తలుగా జీవించబోతున్నాం అని వివరించారు. ఈ వివాహం, జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆలయంలో కొంతమంది న్యాయవాదుల సమక్షంలో జరిగింది.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!