ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంది. మూడు రోజుల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డినీ విచారించనున్నారు సిట్ అధికారులు. జిల్లా జైలు నుంచి సిట్ కార్యాలయానికి శ్రీధర్ రెడ్డిని తీసుకు వచ్చారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో ఏ6గా శ్రీధర్ రెడ్డి ఉన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి రెండో రోజు సిట్ విచారణ కొనసాగనున్నది. నిన్న ఇద్దరిని ఆరున్నర గంటలపాటు సిట్ అధికారులు విచారించారు. లిక్కర్ కేసులో ఏ31గా ధనుంజయ్ రెడ్డి, ఏ32గా కృష్ణ మోహన్ రెడ్డి ఉన్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని సిట్ అధికారులు చెప్పారు.