Michael Rubin: పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది..
- భారత్ పాకిస్తాన్ను సైనికపరంగా, దౌత్యపరంగా ఓడించింది
- పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత, దౌత్య, సైనిక రంగాలలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిందని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. అతను పాకిస్తాన్ తీరును తీవ్రంగా విమర్శించాడు. భారత్ తీసుకున్న సైనిక చర్యను ప్రశంసించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఉగ్రవాద స్థావరాలపై వేగంగా, ఖచ్చితమైన రీతిలో దాడి చేయడం వల్ల ప్రపంచ దృష్టి పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్ వైపు మళ్లిందని, పాకిస్తాన్ అబద్ధాలను మరోసారి ప్రపంచానికి బహిర్గతం చేసిందని రూబిన్ అన్నారు.
Also Read:PBKS vs DC: దాడి జరిగిందని స్టార్క్ చెప్పాడు.. డుప్లెసిస్ షూ కూడా వేసుకోలేదు: అలీసా హీలీ
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
భారత్ పాకిస్తాన్ను సైనికపరంగా, దౌత్యపరంగా ఓడించింది. మే 7న ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీఓజేకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని, ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన అన్నారు. పాకిస్తాన్ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించింది, కానీ భారత్ దానికి ప్రతిస్పందించడమే కాకుండా అనేక పాకిస్తాన్ సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
Also Read:AP Rains: ఎడతెరిపి లేని వర్షాలు.. జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు..
ఈ ఆపరేషన్ పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల మధ్య సంబంధాన్ని మొత్తం ప్రపంచానికి బహిర్గతం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు యూనిఫాంలో వచ్చి ఉగ్రవాదుల అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్నప్పుడు, ఎవరు ఉగ్రవాది, ఎవరు సైనికుడు అనే తేడా లేకుండాపోయిందని అన్నారు. నాలుగు రోజుల యుద్ధంలో, పాకిస్తాన్ భయపడి కాళ్ళ మధ్య తోక పెట్టుకుని కాల్పుల విరమణ కోసం వేడుకునే కుక్కలా మారింది’ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్ ఈ ఓటమిని ఏ విధంగానూ దాచలేకపోయింది. ‘ప్రతి దేశానికి తన పౌరులను రక్షించుకునే హక్కు ఉంది’ అని ఆయన అన్నారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అది పూర్తిగా సమర్థనీయమే. సరిహద్దు అవతల నుంచి వచ్చే ఉగ్రవాద దాడులను భారతదేశం ఎప్పటికీ సహించదని స్పష్టమైన సందేశాన్ని పంపారని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!