Michael Rubin: పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది..
- భారత్ పాకిస్తాన్ను సైనికపరంగా, దౌత్యపరంగా ఓడించింది
- పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత, దౌత్య, సైనిక రంగాలలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిందని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. అతను పాకిస్తాన్ తీరును తీవ్రంగా విమర్శించాడు. భారత్ తీసుకున్న సైనిక చర్యను ప్రశంసించాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఉగ్రవాద స్థావరాలపై వేగంగా, ఖచ్చితమైన రీతిలో దాడి చేయడం వల్ల ప్రపంచ దృష్టి పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్ వైపు మళ్లిందని, పాకిస్తాన్ అబద్ధాలను మరోసారి ప్రపంచానికి బహిర్గతం చేసిందని రూబిన్ అన్నారు.
Also Read:PBKS vs DC: దాడి జరిగిందని స్టార్క్ చెప్పాడు.. డుప్లెసిస్ షూ కూడా వేసుకోలేదు: అలీసా హీలీ
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
భారత్ పాకిస్తాన్ను సైనికపరంగా, దౌత్యపరంగా ఓడించింది. మే 7న ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (పీఓజేకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని, ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన అన్నారు. పాకిస్తాన్ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించింది, కానీ భారత్ దానికి ప్రతిస్పందించడమే కాకుండా అనేక పాకిస్తాన్ సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
Also Read:AP Rains: ఎడతెరిపి లేని వర్షాలు.. జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు..
ఈ ఆపరేషన్ పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల మధ్య సంబంధాన్ని మొత్తం ప్రపంచానికి బహిర్గతం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు యూనిఫాంలో వచ్చి ఉగ్రవాదుల అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్నప్పుడు, ఎవరు ఉగ్రవాది, ఎవరు సైనికుడు అనే తేడా లేకుండాపోయిందని అన్నారు. నాలుగు రోజుల యుద్ధంలో, పాకిస్తాన్ భయపడి కాళ్ళ మధ్య తోక పెట్టుకుని కాల్పుల విరమణ కోసం వేడుకునే కుక్కలా మారింది’ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్ ఈ ఓటమిని ఏ విధంగానూ దాచలేకపోయింది. ‘ప్రతి దేశానికి తన పౌరులను రక్షించుకునే హక్కు ఉంది’ అని ఆయన అన్నారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అది పూర్తిగా సమర్థనీయమే. సరిహద్దు అవతల నుంచి వచ్చే ఉగ్రవాద దాడులను భారతదేశం ఎప్పటికీ సహించదని స్పష్టమైన సందేశాన్ని పంపారని అన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!