Mobile Phones: ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న మొబైల్ఫోన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Phones: ఇటీవల కాలంలో ఇంటిలో ఖాళీగా ఉంటే టీవీ లేదా మొబైల్ చూస్తాం. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా అదే పరిస్థితికి వచ్చారు. వారి దగ్గర ఫోన్ లేక తల్లిదండ్రులను కొనమని హింసిస్తారు. వారు పిల్లలు చెడుపోతారెమో అని భయంతో మెుబైల్ కొనడానికి సంకోచిస్తారు. అయితే పిల్లలు అనుకొన్నది ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తారు. తాజాగా ఇద్దరు విద్యార్థులు గుజరాత్లో వేర్వేరు ఘటనల్లో మొబైల్ ఫోన్ ఇవ్వడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చిన ఈ ఘటనలు గుజరాత్లో ఒకేరోజు చోటుచేసుకున్నాయి. గుజరాత్లో 9వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు తమ తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇవ్వడానికి నిరాకరించడంతో వారి జీవితాలను ముగించారు. సూరత్కు చెందిన ఒక విద్యార్థి, రాజ్కోట్లోని ఒక గ్రామానికి చెందిన మరొకరు మొబైల్ ఫోన్లు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మొదటి సంఘటనలో.. సూరత్లోని వరచా ప్రాంతంలో 9వ తరగతి విద్యార్థిని నెల రోజుల క్రితం తన తల్లిదండ్రుల నుండి మొబైల్ ఫోన్ కొనివ్వమని డిమాండ్ చేసింది. పరీక్షలపై దృష్టి సారించాలని తండ్రి ఆమెకు మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించాడు. అయితే, పరీక్ష తర్వాత ఆమె కోసం స్మార్ట్ఫోన్ కొనుగోలు చేస్తానని చెప్పాడు. అయితే విద్యార్థి వెంటనే మొబైల్ ఫోన్ కావాలని కోరింది. పలుమార్లు నిరాకరించడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Read Also: Kidney For Sale: భరణం కోసం భార్య వేధింపులు.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
మరో ఘటనలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన తండ్రి తన మొబైల్ ఫోన్ను పాఠశాలకు తీసుకెళ్లవద్దని చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇది వాగ్వాదానికి దారి తీసింది. తండ్రి నిర్ణయంతో మనస్తాపానికి గురైన ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనల్లో పోలీసులు ఏడీఆర్ నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఫోన్లు, ఇతర గాడ్జెట్లకు ఎక్కువగా బానిసలయ్యారు. ఇది తరచుగా తీవ్రమైన నేరాలకు దారి తీస్తోంది. మొబైల్ ఫోన్లకు బానిసలైన పిల్లలకు కౌన్సెలింగ్ తప్పనిసరి అని నిపుణులు, పోలీసు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!