Mobile Phones: ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న మొబైల్ఫోన్లు
Mobile Phones: ఇటీవల కాలంలో ఇంటిలో ఖాళీగా ఉంటే టీవీ లేదా మొబైల్ చూస్తాం. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా అదే పరిస్థితికి వచ్చారు. వారి దగ్గర ఫోన్ లేక తల్లిదండ్రులను కొనమని హింసిస్తారు. వారు పిల్లలు చెడుపోతారెమో అని భయంతో మెుబైల్ కొనడానికి సంకోచిస్తారు. అయితే పిల్లలు అనుకొన్నది ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తారు. తాజాగా ఇద్దరు విద్యార్థులు గుజరాత్లో వేర్వేరు ఘటనల్లో మొబైల్ ఫోన్ ఇవ్వడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చిన ఈ ఘటనలు గుజరాత్లో ఒకేరోజు చోటుచేసుకున్నాయి. గుజరాత్లో 9వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు తమ తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇవ్వడానికి నిరాకరించడంతో వారి జీవితాలను ముగించారు. సూరత్కు చెందిన ఒక విద్యార్థి, రాజ్కోట్లోని ఒక గ్రామానికి చెందిన మరొకరు మొబైల్ ఫోన్లు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మొదటి సంఘటనలో.. సూరత్లోని వరచా ప్రాంతంలో 9వ తరగతి విద్యార్థిని నెల రోజుల క్రితం తన తల్లిదండ్రుల నుండి మొబైల్ ఫోన్ కొనివ్వమని డిమాండ్ చేసింది. పరీక్షలపై దృష్టి సారించాలని తండ్రి ఆమెకు మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించాడు. అయితే, పరీక్ష తర్వాత ఆమె కోసం స్మార్ట్ఫోన్ కొనుగోలు చేస్తానని చెప్పాడు. అయితే విద్యార్థి వెంటనే మొబైల్ ఫోన్ కావాలని కోరింది. పలుమార్లు నిరాకరించడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
- Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
- Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
Read Also: Kidney For Sale: భరణం కోసం భార్య వేధింపులు.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
మరో ఘటనలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన తండ్రి తన మొబైల్ ఫోన్ను పాఠశాలకు తీసుకెళ్లవద్దని చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇది వాగ్వాదానికి దారి తీసింది. తండ్రి నిర్ణయంతో మనస్తాపానికి గురైన ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనల్లో పోలీసులు ఏడీఆర్ నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఫోన్లు, ఇతర గాడ్జెట్లకు ఎక్కువగా బానిసలయ్యారు. ఇది తరచుగా తీవ్రమైన నేరాలకు దారి తీస్తోంది. మొబైల్ ఫోన్లకు బానిసలైన పిల్లలకు కౌన్సెలింగ్ తప్పనిసరి అని నిపుణులు, పోలీసు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
-
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
-
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!