Arunachal Pradesh: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు షాక్.. బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో పాటు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పిపి)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అధికార బీజేపీలో జాయిన్ అయ్యారు.
Read Also: Ration Card E-KYC: ముగుస్తున్న రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో మూడు రోజులే చాన్స్
Also Read
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
కాగా, అరవై మంది సభ్యులు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్- ఎన్పీపీ రెండింటికీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు నినాంగ్ ఎరింగ్ (పాసిఘాట్ పశ్చిమ స్థానం), వాంగ్లిన్ లోవాంగ్డాంగ్ (బోర్డురియా-బోగపాని నియోజకవర్గం), NPP నుంచి ముచు మిథి (రోయింగ్ అసెంబ్లీ), గోకర్ బాసర్ (బాసర్ అసెంబ్లీ) చేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పెమాఖండూ పాల్గొన్నారు.
Read Also: R Ashwin: అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసిన ఆర్ అశ్విన్!
అయితే, ఈ నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో బీజేపీకి ఇప్పుడు శాసనసభలో 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఈ ఏడాది అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో కూడిన సుపరిపాలన సూత్రాలపై తనకున్న నమ్మకానికి కాంగ్రెస్, ఎన్పీసీ నుంచి బీజేపీలో చేరారు అని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ సోషల్ మీడియాలో తెలిపారు. సమ్మిళిత వృద్ధి, ప్రజల-కేంద్రీకృత సంక్షేమం సూత్రాలకు మా నిబద్ధతను కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..