Ration Card E-KYC: ముగుస్తున్న రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో మూడు రోజులే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ration Card E-KYC: బోగస్ రేషన్ కార్డుల నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఈ-కేవైసీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పుడు బోగస్ కార్డుల సృష్టికి శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు దగ్గరపడుతోంది. మరో మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్రం ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులు అసలు లబ్ధిదారులను గుర్తించేందుకు జనవరి 31లోగా ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రకటించినా.. మళ్లీ తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డ్ ఇ-కెవైసి ఇంకా పూర్తి చేయని వారికి ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించారు. దీంతో గడుపు తేదీ దగ్గర పడుతుండటంతో అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు. మూడురోజుల్లో ఈ-కేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు.
Read also: TS Inter Exams: ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ కేసు..!
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
తెలంగాణలో 75.76 శాతం మంది రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారు. ఇంకా 25 శాతం మిగిలి ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇంకా e-KYCని పూర్తి చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కూడా గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా వేలిముద్రలు ఇచ్చి ఈ-కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా 100 శాతం ఈ-కేవైసీ పూర్తయ్యేలా చూడాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధికారులకు సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
Read also: Telangana Weather: కూల్ కూల్ గా వాతావరణం.. అక్కడక్కడ చిరు జల్లులు..
ఇ-కెవైసి ఎలా చేసుకోవాలి?
రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి మీ రేషన్ కార్డు నంబర్ మరియు వేలిముద్రలు ఇవ్వాలి. ఇది మీ రేషన్ కార్డ్ నంబర్ను ఆధార్తో లింక్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఇ-కెవైసిని పూర్తి చేసినట్లు ఇపిఒఎస్ మిషన్ నుండి చిన్న రసీదు కూడా అందుకుంటారు. ఈ ప్రక్రియ చాలా సులభం. తెలంగాణలోని రేషన్ కార్డ్ హోల్డర్లు రాష్ట్రవ్యాప్తంగా ఏ రేషన్ షాపుకైనా వెళ్లి ఇ-కేవైసీని పూర్తి చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యులందరూ ఒకేసారి వెళ్లి వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా.. ఎక్కడైనా e-KYCని పూర్తి చేయవచ్చు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!