Ration Card E-KYC: ముగుస్తున్న రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో మూడు రోజులే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ration Card E-KYC: బోగస్ రేషన్ కార్డుల నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఈ-కేవైసీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పుడు బోగస్ కార్డుల సృష్టికి శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు దగ్గరపడుతోంది. మరో మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్రం ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులు అసలు లబ్ధిదారులను గుర్తించేందుకు జనవరి 31లోగా ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రకటించినా.. మళ్లీ తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డ్ ఇ-కెవైసి ఇంకా పూర్తి చేయని వారికి ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించారు. దీంతో గడుపు తేదీ దగ్గర పడుతుండటంతో అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు. మూడురోజుల్లో ఈ-కేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు.
Read also: TS Inter Exams: ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ కేసు..!
Also Read
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
తెలంగాణలో 75.76 శాతం మంది రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారు. ఇంకా 25 శాతం మిగిలి ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇంకా e-KYCని పూర్తి చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కూడా గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా వేలిముద్రలు ఇచ్చి ఈ-కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా 100 శాతం ఈ-కేవైసీ పూర్తయ్యేలా చూడాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధికారులకు సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
Read also: Telangana Weather: కూల్ కూల్ గా వాతావరణం.. అక్కడక్కడ చిరు జల్లులు..
ఇ-కెవైసి ఎలా చేసుకోవాలి?
రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి మీ రేషన్ కార్డు నంబర్ మరియు వేలిముద్రలు ఇవ్వాలి. ఇది మీ రేషన్ కార్డ్ నంబర్ను ఆధార్తో లింక్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఇ-కెవైసిని పూర్తి చేసినట్లు ఇపిఒఎస్ మిషన్ నుండి చిన్న రసీదు కూడా అందుకుంటారు. ఈ ప్రక్రియ చాలా సులభం. తెలంగాణలోని రేషన్ కార్డ్ హోల్డర్లు రాష్ట్రవ్యాప్తంగా ఏ రేషన్ షాపుకైనా వెళ్లి ఇ-కేవైసీని పూర్తి చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యులందరూ ఒకేసారి వెళ్లి వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా.. ఎక్కడైనా e-KYCని పూర్తి చేయవచ్చు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
-
CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!