Turkey On Kashmir: టర్కీ బుద్ధి వంకర.. యూఎన్లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఎర్డోగాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey On Kashmir: ఎన్నిసార్లు భారత్ చెబుతున్నా పాకిస్తాన్ మిత్రదేశం టర్కీ తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాడు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్లోని అత్యున్నత స్థాయి 78వ సెషన్లో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడు. దక్షిణాసియాలో ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు ఉండాలంటే భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చలు, సహకారం ద్వారా కాశ్మీర్ లో న్యాయమైన, శాశ్వతమైన శాంతనిి నెలకొల్పాలి అని అన్నారు.
Read Also: India vs Canada: కెనడా వివాదం.. మంత్రి జైశంకర్తో ప్రధాని మోడీ భేటీ..
Also Read
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
ఇరు దేశల మధ్య చర్చలకు టర్కీ మద్దతు ఇస్తూనే ఉంటుందని ఎర్డొగాన్ తెలిపారు. జీ20 సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీలో చర్చించిన కొన్ని రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని ఎర్డొగాన్ అన్నారు. భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలతో పాటు 15 తాత్కాలిక సభ్యదేశాలను, శాశ్వత సభ్యదేశాలుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ 20 సభ్యదేశాలు రొటేషన్ లో శాశ్వత సభ్యదేశాలుగా ఉండాలని, అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ కన్నా ప్రపంచం చాలా పెద్దదని ఆయన వ్యాఖ్యానించారు.
టర్కీ ఇలా కాశ్మీర్ అంశాన్ని యూఎన్ లో లేవనెత్తడం ఇది మొదటిసారి కాదు. పలు సందర్బాల్లో పాకిస్తాన్ కి వత్తాసు పలికింది. ఇరుదేశాలకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కాశ్మీర్ సమస్య పరిస్కారం కాకపోవడం దురదృష్టకరమని ఎర్డొగాన్ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే కాశ్మీర్ భారత అంతర్గత విషయమని మనదేశం పలుమార్లు టర్కీ వ్యాఖ్యాల్ని తిప్పికొట్టింది. కాశ్మీర్ సమస్యను లేవనెత్తితే తాము సైప్రస్ సమస్యను లెవనెత్తుతామని భారత్ పలు సందర్భాల్లో టర్కీకి చెప్పకనే చెప్పింది.
తాజావార్తలు
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!