Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
- పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ కొత్త కూటమి
- టర్కీ, సౌదీ దేశాలతో పాకిస్థాన్ నాటో తరహా కూటమి
- నిశితంగా పరిశీలిస్తున్న భారత ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్ దేశాలు శుక్రవారం సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. ఈ ఒప్పందంతో మూడు ప్రధాన ముస్లిం దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రాంతీయ భద్రతపై ప్రత్యక్ష అవగాహన ఉన్న వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ వివరాలను వెల్లడించింది. అయితే ఒప్పందం కింద ఒక్కో దేశం ఎలాంటి నిర్దిష్ట బాధ్యతలను స్వీకరిస్తుందనే దానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. టర్కీకి చెందిన ఓ అధికారి కూడా ఈ రక్షణ ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్లు ధ్రువీకరించారు.
ఈ ఒప్పందం సంతకాల కార్యక్రమం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్నట్లు సమాచారం. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కలిసి సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. టర్కీ నాటోలో సభ్యదేశంగా ఉండగా.. సౌదీ అరేబియా అమెరికాకు సన్నిహిత మిత్రదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుల్లో సౌదీ ఒకటి. పాకిస్థాన్ మాత్రం అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిం దేశంగా ఉంది. ఈ మూడు దేశాల మధ్య కుదరనున్న రక్షణ ఒప్పందానికి వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read
- Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
- Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాల భద్రతా వ్యవస్థల్లో ఉన్న బలహీనతలను బయటపెట్టిన నేపథ్యంలో ఈ ఒప్పందం తెరపైకి వచ్చింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధి ద్వారా చమురు, ఇతర కీలక వస్తువుల రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంత దేశాల్లో భద్రతాపరమైన ఆందోళనలు మరింత పెరిగాయి. దాదాపు ఏడాది కాలంగా ఈ మూడు దేశాల మధ్య రక్షణ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. గత జనవరిలోనే ఈ చర్చలపై రాయిటర్స్ కథనం ప్రచురించింది. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ కూడా జనవరిలో విస్తృత ప్రాంతీయ భద్రతా వేదికకు టర్కీ మద్దతు ఇస్తుందని, దాని ద్వారా సహకారం, స్థిరత్వాన్ని పెంచాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రతిపాదిత కొత్త ఒప్పందం ఇప్పటికే పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య ఉన్న రక్షణ ఒప్పందానికి మరింత విస్తరణగా భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే.. అది రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించబడుతుంది. అలాగే అవసరమైన అన్ని సైనిక మార్గాలను ఉపయోగించుకునే అవకాశం ఈ ఒప్పందంలో ఉన్నట్లు గతంలో సౌదీ అధికారి ఒకరు రాయిటర్స్కు తెలిపారు. అయితే తాజా రక్షణ ఒప్పందంపై పాకిస్థాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదు. సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇక ఈ పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
- Tags
- Pakistan
- saudi arabia
- Turkey
తాజావార్తలు
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!