TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జూలై కోటాకు సంబంధింది పలు సేవల టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. నేటి తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 18వ తేదీ ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళపాదపద్మారాధన టికెట్లు పొందడానికి ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడీప్ ఆధారంగా టికెట్లను కేటాయిస్తారు. ఇందులో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి టికెట్ ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేడు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.
ఇక కల్యోణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా అదే రోజు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జులై నెల కోటాను మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఏప్రిల్ 23న ఉదయం 10గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు టీటీడీ ఆన్ లైన్లో విడుదల చేయనుంది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
అలాగే ఏప్రిల్ 23న శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.. వీటితో పాటు జులై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు గదులో కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!