Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ttd Eo Dharma Reddy Says We Will Give Break Darshan To Those Who Wrote Govinda Koti

TTD: ‘గోవింద కోటి’ రాసిన వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తాం: టీటీడీ ఈవో ధర్మా రెడ్డి

NTV Telugu Twitter
Published Date :January 26, 2024 , 12:32 pm
By Sampath Kumar
TTD: ‘గోవింద కోటి’ రాసిన వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తాం: టీటీడీ ఈవో ధర్మా రెడ్డి
  • Follow Us :
  • google news
  • dailyhunt

25 ఏళ్లు లోపు వారు ‘గోవింద కోటి’ పదిలక్షల నూట పదహారుసార్లు రాసిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కార్యక్రమం చేపట్టామని, భక్తులు నుంచి అద్భుత స్పందన వస్తోందన్నారు. నడక మార్గంలో చిరుత పులులు దాడులు అడ్డకట్టకు 5 కోట్లు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారికి అందించామని టీటీడీ ఈవో చెప్పారు. టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ గ్రౌండ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీడీ ఈవో జాతీయ జెండా ఆవిష్కరించగా.. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

టీటీడీ ఈవో ధర్మా రెడ్డి మాట్లాడుతూ… ‘టీటీడీ తరపున వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు 6 లక్షల 50 వేల మంది భక్తులకు దర్శనం చేయించాం. ఫిబ్రవరి 16న రథ సప్తమి వైభవంగా నిర్వహిస్తాం. అయోధ్యలో బాల రాముడు విగ్రహ ప్రతిష్ఠ రోజు లక్ష లడ్డూలు స్వామి వారికి అందించాం. 25 ఏళ్లు లోపు వారు గోవింద కోటి పదిలక్షల నూట పదహారుసార్లు రాసి తీసుకు వచ్చిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తాం. తిరుమలలో ఫిబ్రవరి 3న శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నాం. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కార్యక్రమం చేపట్టాం. భక్తులు నుంచి అద్భుత స్పందన వస్తోంది.. నడక మార్గంలో చిరుత పులులు దాడులు అడ్డకట్టకు 5 కోట్లు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారికి అందించాం. 45 కోట్లు ఖర్చుతో కండలేరు నుంచి 40 టీటీడీ పాలకమండలి ఆమోదం పొందినది. స్వామి వారి అనుగ్రహంతో డిసెంబర్ 6న తిరుమలలో కుండ పోత వర్షం కురిసింది. తిరుమలలో రిజర్వాయర్లు అన్ని నిండాయి. కాషన్ డిపాజిట్ వెనక్కి ఇచ్చే ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చాం’ అని తెలిపారు.

1100 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నగదు వచ్చింది. 700 ఆలయాలు పూర్తి అయ్యాయి, మిగిలినవి మార్చిలోపు పూర్తి చేస్తాం. చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు సమయంలో గుళ్లు, గోపురాలు నిర్మాణం చేస్తే.. నేడు సీఎం జగన్ ప్రభుత్వంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3316 ఆలయాలు నిర్మాణం జరుగుతోంది. నాలుగున్నర ఏళ్లలో టీటీడీ ధార్మిక ఆలయాలు, సదస్సులు శ్రీకృష్ణ దేవరాయలు సమయం కంటే ఎక్కువగా ఆలయాలు నిర్మాణం జరిగింది. తిరుపతిలో అచ్యుతం, శ్రీ పథం గెస్ట్ హౌస్‌లు నిర్మాణం చేస్తున్నాం. దీనిద్వారా 25 వేల మందికి వసతి సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. సీఎం జగన్ ప్రారంభించిన శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా 26 నెలల్లో 2350 గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించాం. మూడు రోజుల చిన్నారికి గుండె ఆపరేషన్ చేసిన చరిత్ర టీటీడీ శ్రీపద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్‌దే. 11 గుండె మార్పిడి ఆపరేషన్స్ చేశాం. ప్రపంచంలోనే ఇంత అద్భుతంగా, వేగంగా గుండె ఆపరేషన్స్ జరిగింది లేదు’ అని టీటీడీ ఈవో పేర్కొన్నారు.

Also Read: IND vs ENG: లంచ్‌ బ్రేక్‌.. భారత్ స్కోరు 222/3!

‘సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన చేశారు. 250 కోట్లతో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతోంది. 80 శాతం పూర్తి అయ్యింది, మరో 20 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో అతీంద్రియ విజ్ఞానం అనే నూతన కోర్సు ప్రారంభించాం. 60 కోట్లతో అత్యాధునిక గోశాల నిర్మాణం చేస్తున్నాం. దాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. 3518 మంది టీటీడీ ఉద్యోగులకు మొదటి విడతలో ఇళ్లు స్థలాలు, రెండో విడత లో 1700 మందికి ఇళ్లు స్థలాలు మంజూరు చేశాం. వెంకటగిరి రోడ్డులో 450 ఎకరాల్లో 5వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేస్తాం. ఫిబ్రవరి నెలాఖరుకు అందిస్తాం’ అని టీటీడీ ఈవో చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Govinda Koti
  • tirumala
  • ttd
  • ttd eo
  • TTD EO Dharma Reddy

తాజావార్తలు

  • COVID-19: భారత్‌లో కరోనాతో వ్యక్తి మృతి.. వైద్యులు ఏం చెప్పారు?

  • Yuva Galam Padayatra Book: గత ప్రభుత్వ అరాచక పాలనపై పుస్తకం.. సీఎంకు అందజేసిన నారా లోకేష్

  • Prabhas: ఫౌజీపైనే ప్రభాస్ ఫోకస్

  • OG Shooting: OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్

  • Rythu Bharosa : రైతు భరోసాపై కీలక ప్రకటన.. అకౌంట్లో డబ్బులు అప్పుడే.!

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions