RS Praveen Kumar : టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి,అక్రమాలు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో వేల కోట్లకు టెండర్లు దక్కించుకొని,నాసిరకంగా పనులు చేసిన కన్స్ట్రక్షన్ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు జరపాలని అన్నారు.
టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ చేసిన అప్పటి ఛైర్మెన్, సభ్యులను కాపాడడం కోసమే గత ప్రభుత్వం సిట్ వేసిందని ఆరోపించిన ఆయన ఇప్పటి వరకూ సిట్ ఎవరినీ ప్రశించలేదన్నారు.టీఎస్పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ విపరీతంగా జరిగిందన్నారు.కేసీఆర్ దొర పాలన పోయి మరో దొర పాలన వచ్చిందే తప్ప,బహుజనుల ఎటువంటి న్యాయం జరుగలేదన్నారు.
Also Read
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Rohit - Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉంటారా?
- Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్లో క్రీడాస్ఫూర్తి.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్న గత హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా ప్రభుత్వం గుంజుకొని హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పేరుతో బడా కంపెనీలకు ఎకరాకు రూ.100 కోట్లకు అమ్ముకుందని ఆరోపించిన ఆయన తిరిగి ఆ భూములు పేదలకు ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న హాస్టల్ మెస్ చార్జీలు విడుదల చేయాలన్నారు.గురుకులంలో విద్యార్దిని ఆత్మహత్యపై స్పందించిన ఆయన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సైకాలజీ కౌన్సిలర్లను నియమించాలని ప్రభుత్వానికి సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 స్థానాలకు బీఎస్పీ పోటీ చేస్తుందని, పొత్తులపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయమే తుది నిర్ణయమని ప్రకటించారు. బీఎస్పీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామన్న ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు చంద్రకల్, దేశి ఇటిక్యాలలో పార్టీ జెండా ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
-
Vanda Devullu Trailer : ‘బిచ్చగాడు’ హీరో మూవీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
-
Rohit – Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉంటారా?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!