RS Praveen Kumar : టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి,అక్రమాలు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో వేల కోట్లకు టెండర్లు దక్కించుకొని,నాసిరకంగా పనులు చేసిన కన్స్ట్రక్షన్ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు జరపాలని అన్నారు.
టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్ చేసిన అప్పటి ఛైర్మెన్, సభ్యులను కాపాడడం కోసమే గత ప్రభుత్వం సిట్ వేసిందని ఆరోపించిన ఆయన ఇప్పటి వరకూ సిట్ ఎవరినీ ప్రశించలేదన్నారు.టీఎస్పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ విపరీతంగా జరిగిందన్నారు.కేసీఆర్ దొర పాలన పోయి మరో దొర పాలన వచ్చిందే తప్ప,బహుజనుల ఎటువంటి న్యాయం జరుగలేదన్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్న గత హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా ప్రభుత్వం గుంజుకొని హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పేరుతో బడా కంపెనీలకు ఎకరాకు రూ.100 కోట్లకు అమ్ముకుందని ఆరోపించిన ఆయన తిరిగి ఆ భూములు పేదలకు ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న హాస్టల్ మెస్ చార్జీలు విడుదల చేయాలన్నారు.గురుకులంలో విద్యార్దిని ఆత్మహత్యపై స్పందించిన ఆయన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సైకాలజీ కౌన్సిలర్లను నియమించాలని ప్రభుత్వానికి సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 స్థానాలకు బీఎస్పీ పోటీ చేస్తుందని, పొత్తులపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయమే తుది నిర్ణయమని ప్రకటించారు. బీఎస్పీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటామన్న ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు చంద్రకల్, దేశి ఇటిక్యాలలో పార్టీ జెండా ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!