Maharashtra Death Mystery: సెల్ఫీ వీడియోతో డెత్ మిస్టరీ ఛేదింపు.. ఎలా అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని కేసులు పోలీసులకు సవాలుగా మారుతుంటాయి. ఆధారాలు లభించక ఏళ్ల తరబడి దర్యాప్తులు కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొన్ని కేసులైతే చిన్న చిన్న క్లూల ద్వారా ఛేదిస్తుంటారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓ డెత్ మిస్టరీని సెల్ఫీ వీడియోతో చాకచక్యంగా పట్టేసుకున్నారు.
రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ ఫోన్ను చోరీ చేసేందుకు దుండగుడు యత్నించాడు. అదే సమయంలో మరో ప్రయాణికుడి సెల్ఫీ వీడియోలో అతడు అడ్డంగా బుక్కై అరెస్ట్ అయ్యాడు. అనంతరం దొంగ దగ్గర దొరికిన ఇంకో ఫోన్ ఆధారంగా ఓ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్లో చోటుచేసుకుంది.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
ఇది కూడా చదవండి: Chandrababu: వింజమూరు ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జాహిద్ జైదీ అనే వ్యక్తి రైలులో సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా.. ఓ వ్యక్తి అతడి ఫోన్ను దొంగిలించే యత్నం చేశాడు. వెంటనే ప్రయాణికుడు అప్రమత్తమై.. పారిపోతున్న దొంగను వీడియోలో రికార్డు చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి దొంగను పట్టుకోవాలని పోలీసులను కోరాడు. వీడియో వైరలవ్వడంతో స్పందించిన కల్యాణ్ రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి దగ్గర ఉన్న ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. ఇటీవల ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన కేసు బయటపడింది.
ఇది కూడా చదవండి: KKR vs RCB: కేకేఆర్ టార్గెట్ 183 పరుగులు.. రాణించిన విరాట్ కోహ్లీ
నిందితుడు జాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. అతడి దగ్గర ఉన్న ఉన్న ఫోన్ ఆన్ చేయగా.. అది పుణెకు చెందిన ప్రభాష్ భాంగేదిగా పోలీసులు గుర్తించారు. బ్యాంక్ ఉద్యోగి అయిన ప్రభాష్.. హోలీ కోసం పుణె నుంచి కల్యాణ్లోని తన నివాసానికి వచ్చాడు. తిరిగి మార్చి 25 అర్ధరాత్రి పుణెకు వెళ్తుండగా విఠల్వాడి రైల్వేస్టేషన్లో రైలు కింద పడి చనిపోయాడు. అతని ఫోన్ జాదవ్ దగ్గరే ఉంది. మొబైల్ను తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించే క్రమంలో భాంగే కదులుతున్న రైల్లో నుంచి కింద పడి మరణించినట్లుగా జాదవ్ పోలీసులకు వివరించాడు.
ఇది కూడా చదవండి: Amit Shah: అమిత్ షాపై “రౌడీ” వ్యాఖ్యలు.. సీఎం కొడుకుపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
తాజావార్తలు
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!