Komatireddy: ఆ ప్రాజెక్టు కు జైపాల్ రెడ్డి పేరు పెడతాం..? రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్న కోమటిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో దివంగత జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రావడంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలను నెక్లెస్ రోడ్డులోని ప్రశోధి స్థల్లో అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి తెలంగాణను నిర్మిస్తారని అన్నారు. జైపాల్ రెడ్డి పేరుతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. జైపాల్ రెడ్డి కృషి ఫలితంగానే హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చిందని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సోనియాను ఒప్పించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారన్నారు.
Read also: Sumaya Reddy: ‘డియర్ ఉమ’ సినిమాతో మరో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ
Also Read
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని ఏపీ నేతలు ప్రచారం చేసినా అది జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు నిలిచిపోయేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెడతామన్నారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జైపాల్రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నేటి రాజకీయ నేతలు జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి గొప్ప నాయకుడిగా ఎదిగారని జూపల్లి అన్నారు. పార్లమెంటులో జైపాల్ రెడ్డి ప్రసంగం చేస్తే ఊరుకునేదని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి పార్లమెంటులో ప్రసంగించే సమయంలో విమర్శలకు పోకుండా సమస్యలపై మాట్లాడేవారన్నారు. పాలకుర్తి ఎత్తిపోతల పథకానికి ఎంతో కృషి చేశారన్నారు.
Chiru: మెగాస్టార్ పాటకి చిందేసిన కలెక్టర్…
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!