Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tpcc Protest Against Central Budget Injustice To Telangana

TPCC Mahesh Goud : తెలంగాణకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తాం

Published Date :February 2, 2025 , 10:41 pm
By Gogikar Sai Krishna
  • ట్యాంక్ బండ్‌లో టీపీసీసీ నిరసన
  • పాల్గొన్న టీపీసీసీ ఛీప్ మహేశ్ కుమార్ గౌడ్
  • తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు : మహేశ్ గౌడ్
TPCC Mahesh Goud : తెలంగాణకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

TPCC Mahesh Goud : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం రాజకీయ భేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తగిన నిధులు కేటాయించకుండా అవహేళన చేస్తోందని నిరసిస్తూ, టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణపై నిజమైన ప్రేమ ఉంటే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Union Minister Suresh Gopi: గిరిజన వ్యవహారాల శాఖను బ్రాహ్మణ లేదా నాయుడు కులాల వారికి ఇవ్వాలి..

తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఒంటరి పోరాటం చేస్తున్నారని మహేశ్ గౌడ్ తెలిపారు. రాష్ట్రానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కనీస నిధులు కేటాయించలేదని విమర్శించారు. ‘‘దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు’’ అనే తెలుగు గేయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోందని ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఢిల్లీ, బీహార్ ఎన్నికల కోసం మాత్రమేనని మహేశ్ గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ, ఇతర రాష్ట్రాలను విస్మరిస్తోందని విమర్శించారు. తెలంగాణ నుంచి జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో సుమారు లక్ష కోట్ల రూపాయలు వసూలు చేస్తూ, కనీసం 40 వేల కోట్లు కూడా తిరిగి ఇవ్వడం లేదని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ, బీఆర్ఎస్, తెలంగాణవాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలుసుకొని నిధుల కోసం యాచించినా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి నిధుల కేటాయింపుపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్రం వైఖరిని నిరసిస్తూ, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గల్లీ నుంచి పట్టణం వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దహనం చేయాలని పీసీసీ చీఫ్ పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, ఈర్లపల్లి శంకర్, నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయి కుమార్, మల్రెడ్డి రాంరెడ్డి, చల్ల నర్సింహారెడ్డి, రియాజ్, మహిళ కాంగ్రెస్ చీఫ్ సునీత రావ్, సామ రాంమోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్‌లు పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ రాజకీయ భేదాలను పక్కన పెట్టి ఒకే వేదికపైకి రావాలని మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి తగిన నిధులు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Sai Pallavi: డైరెక్టర్ సీక్రెట్స్ లీక్ చేసిన సాయి పల్లవి.. పాపం ఆడేసుకుందిగా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ambedkar Statue Protest
  • bandi sanjay
  • bjp
  • central budget
  • Congress Telangana

తాజావార్తలు

  • Israel-Iran War: యుద్ధంలో తీవ్ర విషాదం.. ఒకే చోట 165 మంది విద్యార్థినుల అంత్యక్రియలు..

  • ICC Women’s ODI Rankings 2026: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. టాప్‌ స్పాట్‌కు దూసుకెళ్లిన స్మృతి మందాన

  • NLM Scheme: గాడిదల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం సాయం.. ఏకంగా రూ. 50 లక్షలు.. ఎలా పొందాలంటే?

  • Ayatollah Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ భారత్ మిత్రుడేనా.? ఈ కీలక విషయాలే సాక్ష్యం..

  • Lunar Eclipse : ప్రారంభమైన చంద్రగ్రహణం..సూతక కాలం నియమాలు ఇవే.!

ట్రెండింగ్‌

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • క్లాసిక్ స్టైల్‌కు మోడర్న్ టచ్.. Yezdi Roadster Red Wolf Edition భారత్‌లో లాంచ్..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions