Revanth Reddy : రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నాం.. అని గొప్పగా చెప్పే యాత్ర అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. అక్టోబర్ 24న తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభంకానుంది. అయితే.. ఈ నేపథ్యంలో.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మహారాష్ట్ర బృందంతో భేటీ అయ్యారు. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాయ్ చూర్ నుండి మక్తల్ లోకి రాహుల్ పాదయాత్ర ఎంటర్ అవుతుందని, మహారాష్ట్ర లో నాందేడ్ లోకి ఎంటర్ అవుతుందని ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర కాంగ్రెస్తో సమనవ్యయం కోసం ఈ సమావేశం నిర్వహించామన్నారు. క్షేత్ర స్థాయిలో సమన్వయం కోసం కో ఆర్డినేషన్ కమిటీ వేయనున్నట్లు ఆయన తెలిపారు.
Also Read
తెలంగాణలో పాదయాత్ర జరిగే సమయంలో పరిశీలనకు బృందం రానుందని, తెలంగాణ .. మహారాష్ట్ర నేతలతో కర్ణాటకకి బృందం వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. కర్ణాటక.. తెలంగాణ, మహారాష్ట్ర లో పాదయాత్రనే కీలకమన్న రేవంత్ రెడ్డి.. దండి యాత్ర మాదిరిగా … రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుందన్నారు. అంతేకాకుండా.. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నాం అని గొప్పగా చెప్పే యాత్ర అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!