Congress: చివరి దశకు టీపీసీసీ చీఫ్ కసరత్తు..
- ఈరోజు కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- పీసీసీ చీఫ్.. కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు
- పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసిన ఏఐసీసీ పెద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. నేడు వరంగల్ పర్యటన ఉన్నా.. తన టూర్ ను వాయిదా వేసుకుని హస్తినలోనే ఉన్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సహా.. డిప్యూట సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అనే అంశంపై చర్చించారు. అటు.. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.
Inzamam-ul-Haq: భారత్ ఫైనల్కి చేరడంపై పాకిస్తాస్ అక్కసు.. టీం ఇండియాకి వేరే రూల్స్ అంటూ..
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేసే యోచనలో ఉంది. దీంతో పదవులు ఆశిస్తున్న వారంతా ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. పార్లమెంట్ హాల్లో పార్టీ అధినేత సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ వేర్వేరుగా కలిసి తమ మనసులోని మాటను ఆమెకు తెలియజేశారు. ఇక.. హస్తినలోనే ఉన్న ముఖ్య నేతలు ఎవరెవరికి ఏఏ పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. కేబినెట్ లో ఒకేసారి ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాలా.. లేదా కొన్నింటిని పెండింగ్ లో ఉంచాలా అన్న దానిపై మంతనాలు సాగుతున్నాయి.
Kalki 2898AD : ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టిన కల్కి
ఇక.. మంత్రి మండలి కూర్పు, కాంగ్రెస్ లో చేరికల అంశం భేటీలో చర్చకు వచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామని తెలిపారు. లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని, సీడబ్ల్యూసీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని అన్నారు. అటు.. సామాజిక సమీకరణాలతో పాటు సీనియార్టీ, సమగ్రవంతమైన నాయకుడికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇవాళ కొత్త పీసీసీ పేరు ఖరారు అవుతుందా లేదా ఇంకా టైమ్ పడుతుందా అనేది సస్పెన్స్ గా మారింది.
తాజావార్తలు
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!