ముగిసిన షెకావత్-చంద్రబాబు-పవన్ భేటీ.. ఎనిమిదిన్నర గంటల పాటు చర్చలు
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు ఖరారైన తర్వాత తొలిసారి కీలక భేటీ జరిగింది.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత బైజయంత్ పండా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఇక, బాబు నివాసంలో సుదీర్ఘంగా సాగిన చర్చలు.. దాదాపు ఎనిమిదిన్నర గంటల తర్వాత ముగిశాయి.. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నివాసం నుంచి గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పండా వెళ్లిపోగా.. ఇంకా, చంద్రబాబు నివాసంలోనే ప వన్ కల్యాణ్ చర్చలు జరుపుతున్నారు.. ఇక, చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలకు నివేదించారట గజేంద్ర షెకావత్. రేపు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తే రేపు ఉమ్మడి ప్రకటనకు అవకాశం ఉందని చెబుతున్నారు.. ఈ రోజు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో.. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చించారట.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కీలకంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పవపై కూడా సమాలోచనలు జరిగాయట.. కేంద్ర పథకాల అనుసంధానంతో ఎలాంటి పథకాలను రూపొందించొచ్చనే అంశంపై సమీక్ష జరిగిందని చెబుతున్నారు. కొందరు ఉన్నతాధికారుల పని తీరు మీద భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.. ఈ రోజు సుదీర్ఘంగా భేటీ జరిగినా.. అన్ని విషయాలపై స్పష్టత రాకపోవడంతో.. రేపు మరోసారి మూడు పార్టీల నేతలు భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
అధికారం కాదు.. విలువలు ముఖ్యం
అధికారం కాదు.. విలువలు ముఖ్యం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై స్పందించిన ఆయన.. అధికారం ముఖ్యం కాదు.. నైతిక విలువలు ముఖ్యం అని హితవు పలికారు.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పొత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. 175 స్థాలనాలకు 175 స్థానాలను వైసీపీ గెలుస్తుందని పేర్కొన్నారు.. 4 సిద్ధం సభలు విజయవంతం మా పార్టీ బలంగా తెలిపిన బొత్స.. వారం రోజులుగా ఈ రాష్ట్రంలో పొత్తుల కోసం టీడీపీ, సెలబ్రిటీ పార్టీ తహతహలాడాయి అని ఎద్దేవా చేశారు.. ప్రజాస్వామ్యంలో పొత్తులు సహజం.. కానీ, 14ఏళ్ల పాలించిన చంద్రబాబు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అనడం జుగుప్స కలిగిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, NTRకు వెన్నుపోట్లు పొడిచారని.. అమరావతి రైతుల ఆకాంక్షలను దెబ్బ తీశారని మూడు నెలల క్రితం బీజెపీ నేతలు మాట్లాడారు.. పొత్తులు పెట్టుకున్నప్పుడు రాష్ర్ట ప్రయోజనాల సంగతి ఏదీ..? అని నిలదీశారు.
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇక, టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్లు చెబితేనే ఒంటికాలితో లేచే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. ఈ పొత్తులపై వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంలో వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 2,322 మంది లబ్ధిదారులకు నాలుగుకోట్ల 35లక్షల 37వేల 500 రూపాయల చెక్కును అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు అన్నారు. జనసేన, బీజేపీని కలుపుకుని ఎన్నికలకు వస్తున్నాడు.. రాజకీయంగా, ఆర్ధికంగా తను బాగుపడాలన్నదే చంద్రబాబు ఆలోచన అని దుయ్యబట్టారు.ముస్లింలు, క్రైస్తవులకు బీజేపీ అన్యాయం చేసిందంటాడు.. మళ్లీ అదే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తాడు అని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా తిట్టాడు.. ఇప్పుడు మోడీ గొప్పోడంటున్నాడు అని ఎద్దేవా చేశారు. మోడీని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడన్న ఆయన.. అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎవరి కాళ్లైనా నాకుతాడు అంటూ హాట్ కామెంట్లు చేశారు. మంచి జరిగితేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇక, పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసినా వైసీపీని ఓడించలేరు.. జగన్ మోహన్ రెడ్డిని రెండవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలి.. తుప్పట్టిన సైకిల్ ను రాబోయే ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించి.. బుడమేరులో పడేయాలి అంటూ పిలుపునిచ్చారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు సీఎం జగన్.. యుద్ధానికి సిద్ధం..
నామీద ప్రతి పక్షాలు బురద చల్లినా.. నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ సీఎం జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇంఛార్జ్ సునీల్ కుమార్ యాదవ్తో కలిసి పాల్గొన్న మంత్రి కారుమూరి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామీద ప్రతి పక్షాలు అనవసరమైన విమర్శలు, ఆరోపణలతో బురద చల్లినా… నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు సీఎం జగన్ అన్నారు.. ఇక, కార్యకర్తల కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాను అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప నిజాయితీ పాలన అందించారని కొనియాడారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గం తణుకు అభివృద్ధికి 3,300 కోట్ల రూపాయాలు కేటాయించారని కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. మూడు కండవాలు (తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ) కప్పుకుని వస్తున్న వారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కార్యకర్తలు యుద్దానికి సిద్ధం అని ప్రకటించారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు.
అమరావతి అసైన్డ్ భూముల కేసు.. చార్జిషీట్ దాఖలు చేసిన సీఐడీ
అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది సీఐడీ.. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లో పలు కీలక అంశాలను పేర్కొంది.. ఈ కేసులో రూ.4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ అభియోగాలు మోపింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్నారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ.. వారితో పాటు ఈ కేసులో తుళ్ళూరు అప్పటి తహశీల్దార్ అన్నే సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ సంస్థ ఎండీ అంజనీ కుమార్ కూడా నిందితులుగా ఉన్నారు.. అమరావతిలో 1100 ఏకరాలకు సంబంధించి రూ.4,400 కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు అంచనా వేసింది సీఐడీ.. చంద్రబాబు, నారాయణ బినామీలతో రాజధాని ఏరియాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోకుండా.. కొనుగోలు చేసినట్టు సీఐడీ గుర్తించింది.. 2014కు ముందు.. ఆ తర్వాత ల్యాండ్ రికార్డ్స్ పరిశీలిస్తే 942 ఏకరల్లో 1330 మంది వ్యక్తులు CRDAలో LPS ద్వారా లబ్ది పొందినట్టు చార్జీ షీట్ లో పేర్కొంది సీఐడీ.. కొమ్మరెడ్డి బ్రహ్మానందరెడ్డి అనే రియల్టర్ ను అప్రూవర్ గా స్టేట్ మెంట్ నమోదు చేసినట్టు కోర్టుకు తెలిపింది సీఐడీ..
చంద్రబాబు ఇంటి దగ్గర కేఏ పాల్ హల్ చల్.
ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. మరికొందరు ముఖ్యనేతల సమావేశం జరుగుతోన్న సమయంలో.. చంద్రబాబు ఇంటి దగ్గర హల్చల్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎలక్షన్ నిర్వహించడం కోసం ముగ్గురు కమిషనర్లు ఉండాలి.. కానీ, ఇప్పుడు ఒక్కరే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికలు జరుపకూడదని తెలిపారు.. మరోవైపు కాపులు అంత ప్రజాశాంతి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారు కేఏ పాల్.. అంతేకాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన ముద్రగడ పద్మనాభంకు కూడా హ్వానం పలికారు.. ఆయన మళ్లీ ఆలోచించి ప్రజాశాంతి పార్టీలోకి రావాలని అభిప్రాయపడ్డారు పాల్.. ఇక, ”పాల్ రావాలి.. పాలన మారాలి..” అంటూ కొత్త నినాదం చేశారు.. తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు బాబు మోహన్ నా పార్టీలోకి వచ్చాడని గుర్తుచేసిన ఆయన.. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నన్ను కలవండి.. నేను ప్రజాశాంతి పార్టీ టికెట్లు ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.
నాగార్జున రేర్ ఫ్యామిలీ ఫోటో.. అఖిల్ ఉన్నంత హ్యాపీగా చై లేడెందుకు..?
అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన లెగెసీని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున ముందుకు నడిపిస్తున్నాడు. అక్కినేని కుటుంబంలో నాగార్జున మాత్రమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రితో నాగ్ కు ఎన్నో జ్ఞాపకాలు అని చెప్పొచ్చు. ఇక నాగ్ మొదట వెంకటేష్ చెల్లిని వివాహమాడాడు. వారికి పుట్టిన కొడుకే నాగ చైతన్య. ఇక ఆమెతో విడాకులు అయ్యాకా.. హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి పుట్టిన కొడుకే అఖిల్. చిన్నతనం నుంచి చై.. అక్కినేని ఇంట కన్నా దగ్గుబాటి ఇంట్లోనే ఎక్కువ పెరిగాడన్న విషయం అందరికి తెల్సిందే. రెండు కుటుంబాల మధ్య పెరిగాడు చై. అమల కుల చై ను తన పెద్ద కొడుకుగానే చూసుకుంది. తాజాగా అక్కినేని కుటుంబం రేర్ పిక్ ఒకటి బయటకొచ్చింది. ఇందులో అక్కినేని నాగేశ్వరావు, అన్నపూర్ణమ్మ దంపతులతో పాటు నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. అమల పక్కన అఖిల్, చైతన్య ఉన్నారు. అఖిల్ వయస్సు మూడేళ్లు ఉన్నట్లు ఉండగా .. చై ఆరేళ్ళులా కనిపిస్తున్నాడు. అయితే.. ఈ ఫొటోలో అందరి ముఖంలో నవ్వు ఉంది కానీ, చైతన్య ముఖం మాత్రం చాలా బాధగా ఉన్నట్లు ఉంది. ఇక ఈ ఫోటో చూసినవారందరూ.. చై ఎందుకు అలా ఉన్నాడు.. ? అని ప్రశ్నిస్తుండగా.. ఇంకొందరు మాత్రం తమకు తోచిన సమాధానాలు చెప్పుకొస్తున్నారు. చై.. తల్లి లేదుగా అందుకే అలా ఉన్నాడని కొందరు.. ఫోటో తరువాత స్కూల్ కి వెళ్ళాలి అని చెప్పినట్టున్నారని కొందరు.. చాక్లెట్స్ ఇవ్వనని చెప్పరేమో అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
నాగార్జున రేర్ ఫ్యామిలీ ఫోటో.. అఖిల్ ఉన్నంత హ్యాపీగా చై లేడెందుకు..?
అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన లెగెసీని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున ముందుకు నడిపిస్తున్నాడు. అక్కినేని కుటుంబంలో నాగార్జున మాత్రమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రితో నాగ్ కు ఎన్నో జ్ఞాపకాలు అని చెప్పొచ్చు. ఇక నాగ్ మొదట వెంకటేష్ చెల్లిని వివాహమాడాడు. వారికి పుట్టిన కొడుకే నాగ చైతన్య. ఇక ఆమెతో విడాకులు అయ్యాకా.. హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి పుట్టిన కొడుకే అఖిల్. చిన్నతనం నుంచి చై.. అక్కినేని ఇంట కన్నా దగ్గుబాటి ఇంట్లోనే ఎక్కువ పెరిగాడన్న విషయం అందరికి తెల్సిందే. రెండు కుటుంబాల మధ్య పెరిగాడు చై. అమల కుల చై ను తన పెద్ద కొడుకుగానే చూసుకుంది. తాజాగా అక్కినేని కుటుంబం రేర్ పిక్ ఒకటి బయటకొచ్చింది. ఇందులో అక్కినేని నాగేశ్వరావు, అన్నపూర్ణమ్మ దంపతులతో పాటు నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. అమల పక్కన అఖిల్, చైతన్య ఉన్నారు. అఖిల్ వయస్సు మూడేళ్లు ఉన్నట్లు ఉండగా .. చై ఆరేళ్ళులా కనిపిస్తున్నాడు. అయితే.. ఈ ఫొటోలో అందరి ముఖంలో నవ్వు ఉంది కానీ, చైతన్య ముఖం మాత్రం చాలా బాధగా ఉన్నట్లు ఉంది. ఇక ఈ ఫోటో చూసినవారందరూ.. చై ఎందుకు అలా ఉన్నాడు.. ? అని ప్రశ్నిస్తుండగా.. ఇంకొందరు మాత్రం తమకు తోచిన సమాధానాలు చెప్పుకొస్తున్నారు. చై.. తల్లి లేదుగా అందుకే అలా ఉన్నాడని కొందరు.. ఫోటో తరువాత స్కూల్ కి వెళ్ళాలి అని చెప్పినట్టున్నారని కొందరు.. చాక్లెట్స్ ఇవ్వనని చెప్పరేమో అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
దేశంలోనే తొలిసారి.. హుస్సేన్సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో.. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ‘కోహినూర్’ వజ్రం గురించిన కథ కూడా ఉంటుంది. తెలంగాణ భూముల్లోనే కోహినూర్ వజ్రం లభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్ కథ.. భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి చేసి ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్ పై రంగుల రంగుల లేజర్ వెలుతురులో వివరించనున్నారు. ఈ కథను రాజ్యసభ ఎంపీ, సినీ రచయిత శ్రీ విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో.. ప్రముఖ రచయిత SS కంచి రాశారు. ప్రముఖ నేపథ్య గాయని (ప్లే బ్యాక్ సింగర్) శ్రీమతి సునీత గాత్రాన్ని అందించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడి చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ.. సౌండ్ అండ్ లైట్ షోస్ ఉన్నాయి. కానీ.. ఓ చెరువు అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి.
అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ నేటి నుంచి అమలులోకి రాబోతుందంటూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం 1955కి 2019లో కేంద్రం సవరణ చేసిన సంగతి తెలిసిందే. 2016లో పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. 2019లో ఆమోదం పొందిన బిల్లుకు.. ఇప్పటివరకు కేంద్రం నిబంధనలను ప్రకటించలేదు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో సీఏఏను ప్రతిపాదించింది. 2019లో కేంద్రం చట్టం చేసింది.. ఇప్పుడు అమలు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. లోక్సభ ఎన్నికల ముందే ఈ చట్టం తీసుకొస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ విభజన జరిగినప్పుడు పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న మైనారిటీల కోసం కాంగ్రెస్ పార్టీ పౌరసత్వం కల్పిస్తామన్న వాగ్దానం చేసింది.. కానీ అమలు చేయలేదు, చట్టం తీసుకురాలేదని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్లలో హింసకు గురై మన దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం మంజూరు చేయడానికి ఉద్దేశించిన చట్టమే పౌరసత్వ సవరణ చట్టం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టం అనుమతించినుంది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు మూడు దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు బౌద్ధులు, పార్శీలకు ఈ పౌరసత్వ సవరణ చట్టం వర్తించనుంది.
డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించిన మోడీ
డీఆర్డీవో రూపొందించిన మిషన్ దివ్యాస్త్ర విజయవంతమైంది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఇది ఛేదించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా అభినందించారు. ఎంఐఆర్వీ సాంకేతికతతో అగ్ని-5 క్షిపణి రూపొందించారు. మిషన్ దివ్యాస్త్ర పేరుతో డీఆర్డీవో అగ్ని-5 క్షిపణిని ప్రయోగించారు. దేశీయంగానే ఎంఐఆర్వీ సాంకేతికతతో ఈ క్షిపణిని డీఆర్డీవో అభివృద్ధి చేసింది. మల్టీపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ సాంకేతికతతో దేశీయంగా దీనిని అభివృద్ధి చేశారు. ఈ ప్రయోగం విజయవంతంగా సక్సెస్ అయింది. దీంతో డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో చైనాకు భారత్ ఒక బలమైన సందేశాన్ని పంపించింది. ఈ ప్రయోగంతో భారతదేశ రక్షణ సామర్థ్యాల్లో ఈ విజయం గణనీయమైన పురోగతిగా ప్రశంసింపబడుతోంది.
తమిళనాడులో రూ.100 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ సీజ్
తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలోని మిమిసాల్ గ్రామంలోని రొయ్యల ఫారంలో కస్టమ్స్ అధికారులు రూ.100 కోట్లకు పైగా విలువైన హాషీష్ ఆయిల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మండపం సమీపంలో రూ.108 కోట్ల విలువైన 99 కిలోల హషీష్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంకకు అక్రమ రవాణా చేసేందుకు రొయ్యల ఫారమ్లో హషీష్, గంజాయి వంటి డ్రగ్స్ పెద్ద మొత్తంలో సేకరించినట్లు సమాచారం అందిందని కస్టమ్స్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని వ్యక్తుల సమక్షంలో తాళం పగులగొట్టి హషీష్ ఆయిల్, గంజాయి నింపిన 48 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పొలంలో విద్యుత్ సరఫరా లేనందున నిషేధిత పదార్థాన్ని సమీపంలోని కస్టమ్స్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇక్కడ పరీక్షించిన అనంతరం బ్యాగులో నుంచి రూ.110 కోట్ల విలువైన 100 కిలోల హషీష్, రూ.1.05 కోట్ల విలువైన 876 గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) యాక్ట్ 1985, కస్టమ్స్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకున్నారు.
బ్రిటన్ యువరాణి ఫొటో విడుదల.. అయినా అనుమానాలే?
బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ గత జనవరి నుంచి అదృశ్యమయ్యారు. కడుపులో ఆమెకు శస్త్ర చికిత్స జరిగిందని వాదనలు వినపడ్డాయి. అప్పటి నుంచి ఆమె అధికారికంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాలైన వాదనలు పుట్టుకొచ్చాయి. సీరియస్గా ఉందని కొందరు.. ఇంకేదో అయిందని మరికొందరు పుకార్లు సృష్టించారు. అయినా కూడా ఇప్పటి వరకు రాజకుటుంబం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తాజాగా రాజకుటుంబం నుంచి కేట్ మిడిల్టన్కు సంబంధించిన ఫొటోను విడుదల చేసింది. అయినా దీనిపైన కూడా నెట్టిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫొటో ఎడిట్ చేసి విడుదల చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. కేట్ ఆరోగ్యం గురించి గత కొన్ని రోజులుగా అనేక వదంతులు వినిపించాయి. ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరిలో వెల్లడించింది. అప్పటి నుంచి ఆమె బాహ్య ప్రపంచానికి ఎక్కడా కన్పించకపోవడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఆమె కోమాలోకి వెళ్లి ఉండొచ్చని ప్రచారం జరిగింది. ఆదివారం బ్రిటన్లో మదర్స్ డే పురస్కరించుకుని కెన్సింగ్టన్ ప్యాలెస్ ఓ ఫొటో విడుదల చేసింది. అందులో కేట్ తన ముగ్గురు పిల్లలతో కలిసి కన్పించారు. గత రెండు నెలలుగా మద్దతుగా నిలిచిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆ ఫొటోను తన భర్త, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విలియం తీసినట్లు ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
అదిరిపోయే ఫీచర్స్ తో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
శాంసంగ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చారు.. గెలాక్సీ ఎమ్-సిరీస్ ఫోన్ ఆక్టా-కోర్ చిప్సెట్పై రన్ అవుతుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, హెడ్లైన్తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ను కలిగి ఉంది.. ఈ కొత్త ఫోన్ మూడు ఆప్షన్స్ లో రానుంది.. 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్టుతో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో)కి సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. 6.5-అంగుళాల ఫుల్-హెచ్డీ+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే కలిగి ఉంది. గరిష్టంగా 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్ను అందిస్తుంది.. 128 జిబీ స్టోరేజ్ తో రాబోతుంది.. సెల్ఫీ ప్రియులకు ఇది గుడ్ న్యూస్.. ట్రిపుల్ కెమెరాను అందుబాటులోకి రానుంది.. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ సెకండరీ సెన్సార్, 2ఎంపీ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్లకు 13ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.. ఇక 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్టుతో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. శాంసంగ్ ఫోన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 21 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.. అలాగే ఈ ఫోన్ బరువు 217 గ్రాములు ఉంటుంది.. ఇక ధర విషయానికొస్తే.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ గ్రే, డార్క్ బ్లూ, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. గతంలో లాంచ్ అయిన గెలాక్సీ ఎ15 ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 19,499గా నిర్ణయించింది. అలాగే, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,499గా ఉంది..
మమ్ముట్టి నట బీభత్సం.. ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎందులో చూడాలంటే?
ప్రస్తుతం వరుస హిట్స్తో దూసుకుపోతున్న మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ భ్రమయుగం. ఆయన గత సినిమాలు కన్నూర్ స్క్వాడ్ వంద కోట్లు మరియు కాథల్ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టగా భ్రమయుగం టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ రేకెత్తించాయి. ఇక ఎక్స్పరిమెంటల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భ్రమయుగం ఎంతగానో ఆకట్టుకుంది. పూర్తి బ్లాక్ అండ్ వైట్ ఫార్మట్లో కేవలం మూడు పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్బస్టర్గా నిలిచింది. తెలుగులో వారం ఆలస్యంగా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్నా కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ సినిమాను సితార సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు ప్రచారం జరిగింది. దాదాపు 30 కోట్లకు సోనీ లివ్ భ్రమయుగం డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాను ఇప్పుడు సోనీ లివ్ మార్చ్ 15 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల హక్కులు మొత్తం సోనీ లివ్ దక్కించుకోగా మార్చి 15 నుంచి భ్రమయుగం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక భ్రమయుగం మూవీతో మమ్ముట్టి వరుసగా ఆరో బ్లాక్బస్టర్స్ ను తన ఖాతాలో వేసుకున్నట్టయింది. ఇక ప్రస్తుతం టర్బో సినిమాతో పాటు బజూక అలాగే మరో సినిమాను చేస్తున్నారు. ఇక రీసెంట్ గా తెలుగులో వైఎస్ జగన్ బయోపిక్గా తెరకెక్కిన యాత్ర 2లో మమ్ముట్టి గెస్ట్ రోల్లో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే.
చనిపోయిన సూర్య కిరణ్ ను తరిమి తరిమి కొట్టిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి.. ఎందుకో తెలుసా?
బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి నటుడిగా కొన్ని సినిమాలు చేసి దర్శకుడిగా మారి కొన్ని గుర్తుంచుకోదగ్గ సినిమాలు చేశారు సూర్య కిరణ్. తెలుగులో ఆయన సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్, చాప్టర్ 6 వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న అరసి అనే సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు. అయితే సూర్య కిరణ్ గత కొంత కాలంగా ఆయన పచ్చ కామెర్లతో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. గతంలో హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి వివాహం చేసుకున్న సూర్య కిరణ్ తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. వారిరువురికి విడాకులు కూడా అయ్యాయి. ఇక ఆయన మరణ వార్త నేపథ్యంలో తెలుగు, తమిళ సినీ రంగాలకు చెందినవారు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఏఎస్ రవికుమార్ చౌదరి తాను సూర్య కిరణ్ ని తరిమి తరిమి కొట్టాను అని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే ఏ ఎస్ రవికుమార్ చౌదరి గురువు దర్శకుడు సాగర్ చనిపోయిన సమయంలో ఆవేదనతో తాను సూర్య కిరణ్ మీద దాడి చేసినట్లు ఏ ఎస్ రవికుమార్ చౌదరి చెప్పుకొచ్చారు. తన గురువు సాగర్ ని మందుకు బాగా అలవాటు చేసి ఆయన ప్రాణం పోయేదాకా సూర్యకిరణ్ పరువు పోయేదాకా తాగారని తన గురువుకి అలా చేయడం తనకు బాధ అనిపించి అతని బాగా కొట్టానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పకొచ్చారు. ఇంటర్వ్యూ పాతదే అయినా ఈ కామెంట్స్ ఇప్పుడు మరోమారు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం సూర్య కిరణ్ మందుకు బాగా అలవాటు పడ్డాడని అర్ధం అవుతోంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.