పవన్పై ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు.. వస్తే ఒక నమస్కారం.. రాకపోతే రెండు..!
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారనే వార్తలు వచ్చాయి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకిలో వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు.. ఆ తర్వాత జనసేన పార్టీ నేతలు ఆయన్ని కలవడం.. త్వరలోనే పవన్ కల్యాణ్.. ముద్రగడ దగ్గరకు వచ్చి కలుస్తారని.. పార్టీలోకి ఆహ్వానిస్తారనే ప్రచారం సాగింది.. అయితే, పవన్ కల్యాణ్.. రాజమండ్రి పర్యటనలో ఉన్న వేళ.. పవన్ రాకపై సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ్డ పద్మనాభం.. పవన్ కల్యాణ్ రాజమండ్రి వచ్చిన విషయాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించారట అనుచరులు.. దీంతో, పవన్ రాకపై ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మనం చెప్పాల్సింది చెప్పాం తర్వాత మనం చేసేది ఏమి లేదన్న ముద్రగడ.. వస్తే ఒక నమస్కారం.. రాకపోతే రెండు నమస్కారాలు అంటూ సంచలన కామెంట్ చేశారట.. కాగా, గత నెల ముద్రగడ పద్మనాభం నివాసానికి రెండుసార్లు వెళ్లారు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్.. త్వరలోనే పవన్ కల్యాణ్ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని ఈ సందర్భంగా బొలిశెట్టి చెప్పుకొచ్చారు.. అయితే, పవన్ కల్యాణ్ తన నివాసానికి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తానని బొలిశెట్టికి చెప్పారు ముద్రగడ.. కానీ, దాదాపు నెలరోజులు దాటిన ముద్రగడ నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లే వ్యవహారంపై ప్రతిష్టాంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ముద్రగడ తన అనుచరుల దగ్గర చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
లోకేష్కి మంత్రి అమర్నాథ్ రిటర్న్ గిఫ్ట్.. మట్టి కుండలో ఉత్తరాంధ్ర ఉప్పు, కారం కలిపిన పప్పు..!
ఏపీలో రాజకీయం కాకరేపుతోంది.. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లే కాదు.. ఇప్పుడు.. గిఫ్ట్లు.. రిటర్న్ గిఫ్ట్ల వరకు వెళ్లింది వ్యవహారం.. అనకాపల్లిలో శంఖారావం సభ నిర్వహించిన నారా లోకేష్.. ఈ సందర్భంగా ఐటీ మంత్రి అమర్నాథ్కు కోడిగుడ్డును అవార్డుగా ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అంతే కాదు.. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన గుడివాడ అమర్నాథ్కి దీనిని బహుమతిగా పంపుతున్నానని పేర్కొన్నారు.. దీంతో.. కౌంటర్ ఎటాక్కు దిగిన మంత్రి గుడివాడ.. లోకేష్కు రిటర్న్ గిఫ్ట్ పంపిస్తున్నట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు.. ఓ కుండలో ఒడికించిన పప్పును తీసుకొచ్చి మరీ చూపించారు.. శంఖారావం అని పలకడం కూడా తెలియని మొద్దు లోకేష్ అని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్.. లోకేష్ కోడిగుడ్డు గిఫ్ట్ కు రిటర్న్ గిఫ్ట్ ఇదే.. మట్టి కుండలో పప్పులో.. ఉప్పు, కారం కలిపి సిద్ధంగా ఉంచాం.. లోకేష్ తనంతట తానుగా వచ్చినా సరే.. లేకపోతే నేనే పంపిస్తాను.. చంద్రబాబు, లోకేష్లో పౌరుషం, రోషం రావాలనే పప్పులో ఉత్తరాంధ్ర ఉప్పు, కారం కలిపానంటూ వ్యాఖ్యానించారు.. లోకేష్ లా నేను బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదన్న ఆయన.. లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్.. అవినీతి చేసినట్టు.. కానీ, భూ ఆక్రమణ లకు పాల్పడినట్టుగానీ నిరూపిస్తే రాజకీయాలు వది లేస్తానని ప్రకటించారు.
నూజివీడులో ఆసక్తికర పరిణామాలు.. ఇంఛార్జ్ని ప్రకటించిన టీడీపీ
నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.. నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్గా కొలుసు పార్థసారథిని ప్రకటించింది పార్టీ అధిష్టానం.. దీంతో, వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి పార్థసారథి పోటీ చేయడం ఫైనల్ అయ్యింది.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన పార్థసారథి.. టీడీపీలో చేరిన తర్వాత.. నూజివీడుపై ఫోకస్ పెట్టారు.. ఈ పరిణామాలు అప్పటి వరకు టీడీపీ ఇంఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్రబోయినకు నచ్చలేదు.. కానీ, ముద్రబోయినకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది టీడీపీ.. ఆయన మాత్రం రాజీపడలేదు.. కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నన్ను మోసం చేశారంటూ కన్నీరుమున్నీరయ్యారు.. ఆ తర్వాత సోమవారం రోజు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు ముద్రబోయిన. దీంతో.. కొలుసు పార్థసారథిని నూజివీడు ఇంఛార్జ్గా నియమించింది టీడీపీ అధిష్టానం.. ఈ మేరకు టీడీపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఒంగోలులో కలకలం.. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిపై కత్తితో దాడి..
ప్రకాశం జిల్లా ఒంగోలులో తీవ్ర కలకలం రేగింది.. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కత్తితో దాడి చేశారు.. ఒంగోలు జిమ్స్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.. ఆర్థిక వివాదాల నేపథ్యంలో మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై కత్తితో దాడి చేశాడు ఒంగోలో జిమ్స్ ఆస్పత్రి ప్రధాన వైద్యుడు మర్రెడ్డి రామచంద్రారెడ్డి.. ఇదంతా ప్రీప్లాన్తో చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డిని సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు. అయితే, గత కొద్ది రోజులుగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మర్రెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఆర్థిక వ్యవహారాలు గొడ జరుగుతున్నాయి.. ఆ వివాదాలను పరిష్కరించుకుందామంటూ జిమ్స్కి శ్రీనివాస్రెడ్డిని పిలిచిన రామచంద్రారెడ్డి.. ఒక్కసారిగా కత్తితో దాడికి దిగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో గాయపడ్డి శ్రీనివాసరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
వైసీపీ వైపు టీడీపీ మాజీ ఎంపీ చూపు..! క్లారిటీ ఇచ్చిన నేత
ఎన్నికల సమయంలో కొందరు నేతలు.. కొన్ని గంటల్లోనే పార్టీ కండువా మార్చేస్తున్నారు.. మరికొందరు అలా వెళ్లి ఇలా మళ్లీ వెనక్కి వస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఎవరికి తోచిన ప్రచారం వాళ్లు చేస్తున్నారు.. తాజాగా, టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.. పార్టీ మార్పుపై సోషల్ మీడియా వేదిక వారే నడుస్తోంది.. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ.. టీడీపీకి గుడ్బై చెబుతారని.. త్వరలోనే వైసీపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. ఫేస్ బుక్, వాట్సప్ గ్రూప్స్ లో వైరల్ గా మారిపోయింది కొనకళ్లకు సంబంధించిన పోస్టు.. అయితే, ఇది వైసీపీ మైండ్ గేమ్ అని కొనకళ్ల పార్టీ మారటం జరగదని, ఇది ఫేక్ ప్రచారం అంటూ సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ వచ్చారు కొనకళ్ల అనుచరులు.. ఇక, పార్టీ మార్పు వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు కొనకళ్ల.. వైసీపీలో చేరికపై టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ స్పందిస్తూ.. రెండు రోజులుగా వైసీపీలో కొనకళ్ల చేరుతున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోనే కొనసాగుతాను అని ప్రకటించారు. వైసీపీలో చేరుతున్నా అని జరుగుతున్న ప్రచారం సత్యదూరం.. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.. నాకు వైసీపీలో చేరే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల మా క్రెడిబిలిటీ దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం కోసం పనిచేస్తాను అని స్పష్టం చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. కాగా, బందరు నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచి ఆయన.. గత ఎన్నికల్లో ఓడిపోయారు.. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకి కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉందని.. దీంతో కొనకళ్లతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరగడంతో.. చివరకు అలాంటి ఏమీ లేదని ఆయనే క్లారిటీ ఇచ్చారు.
టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్బై.. మీకు.. మీ పార్టీకి ఓ నమస్కారం..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.. వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీ నూజివీడు నియోజకవర్గం ఇంచార్జ్గా నియమించిన తరునంలో.. తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పారు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. తన కార్యాలయంలో ఉన్న టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. టీడీపీకి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు.. అయితే, తాను వైసీపీలో చేరలేదు.. త్వరలోనే రాజకీయ భవిష్యత్పై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. మీకు మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ మీడియా ముఖంగా వ్యాఖ్యానించిన ఆయన.. పార్ధసారథి ఇంకా టీడీపీ కండువా కప్పుకోలేదు.. కానీ, పార్టీ నూజివీడు ఇంఛార్జ్గా ప్రకటించారు అంటూ మండిపడ్డారు.. ఉరిశిక్ష వేసే ముందు.. కోర్టులో న్యాయమూర్తి ఆఖరి కోరిన అడుగుతారు.. కానీ, నన్ను పార్టీ అడగలేదు అనే వాపోయారు. త్వరలో రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానన్న ఆయన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు నేనేమైనా చెప్పానా? అని ప్రశ్నించారు. సీఎంవోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించాను.. ముఖ్యమంత్రిని ఎవరైనా కలవచ్చు కదా? అని నిలదీశారు. ఇక, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసే అంశంతో సహా అన్ని విషయాలపై త్వరలోనే క్లారిటీ ఇస్తాను అని తెలిపారు. కానీ, పదేళ్లు నన్ను వాడుకుని బయటకు గెంటేశారు అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.
రెబల్ ఎమ్మెల్యేల స్పీకర్ ఫైనల్ లెటర్.. విచారణ ముగిసింది.. ఇక చర్యలే..!?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.. ఈ నెల 19వ తేదీన తుది విచారణ ఉంటుందంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందుగానే సంబంధిత రెబల్స్కు సమాచారం ఇచ్చినా.. ఎవరూ హాజరు కాకపోవడంపై.. స్పీకర్ సీరియస్ అయిన విషయం విదితమే.. న్యాయ నిపుణుల సలహా తీసుకుని.. వారిపై చర్యలకు సిద్ధం అవుతున్నారు స్పీకర్.. ఈ నేపథ్యంలోనే రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల అంశంలో త్వరలో నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ తమ్మినేని సిద్ధం అవుతున్నారు.. అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసినట్టేనని స్పష్టం చేశారు.. ఈ మేరకు 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ నుంచి తాజాగా లేఖలు వెళ్లాయి.. విచారణకు అవకాశం ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేదని లేఖల్లో వెల్లడించారు స్పీకర్. ఈ నెల 19వ తేదీన చివరి విచారణ ఉంటుందన్నా.. హాజరు కాకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు.. అవకాశాలిచ్చినా విచారణకు హాజరు కాలేదనే విషయాన్ని పేర్కొన్నారు. ఇక విచారణ ఉండవని లేఖల్లో సంకేతాలు ఇచ్చారు.. అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని ప్రకటించబోతున్నానని స్పష్టం చేశారు.. ప్రస్తుతానికి అనర్హత పిటిషన్లపై తన నిర్ణయాన్ని రిజర్వులో పెట్టారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. అయితే, రెబల్ ఎమ్మెల్యేలకు ఫైనల్ గా ఓ లెటర్ రాసిన స్పీకర్ తమ్మినేని ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి పచ్చజెండా..
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం(చౌటుప్పల్-అమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన తర్వాత ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి, పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులుగా విస్తరించాల్సిన రాష్ట్ర రహదారుల జాబితాను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి అందజేశారు. ఆయా రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాల్సిన ఆవశ్యకతను వివరించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి ఆయన అధికారిక నివాసంలో బుధవారం మధ్యాహ్నం కలిశారు. సుమారు గంటన్నరపాటు కొనసాగిన భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, జాతీయ రహదారుల పనులకు సంబంధించిన వివిధ సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తొలుత రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నార్తరన్ పార్ట్ చౌటుప్పల్-భువనగిరి-తుఫ్రాన్-సంగారెడ్డి-కంది పరిధిలో యూటిలిటీస్ (కరెంటు స్తంభాలు, భవనాల తదితరాలు) తొలగింపునకు సంబంధించి వ్యయం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంబనపై చర్చసాగింది. యూటిలిటిస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పది నెలల క్రితం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంబన నెలకొంది.
ఇండియా కూటమికి పెద్ద విజయం.. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సీఎం
చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ‘ఇండియా’ కూటమికి పెద్ద విజయం అని అభివర్ణించారు. ఇండియా కూటమికి ఇది తొలి విజయమని, దీనికి అర్థం ఎంతో ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి సుప్రీం నిర్ణయంపై కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇంత చిన్న ఎన్నికలోనే బీజేపీ దోపిడికి పాల్పడిందని తెలిపారు. అయినా.. మేము అధైర్యపడలేదని, చివరి క్షణం వరకు పోరాడి లాక్కున్నామని చెప్పారు. ఇది యావత్ దేశానికి, ఇండియా కూటమికి పెద్ద విజయం అని అన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 36 ఓట్లు వచ్చాయని, చండీగఢ్ మేయర్ ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ వాళ్లు 8 ఓట్లను కొల్లగొట్టారని కేజ్రీవాల్ ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయని, అందులో 90 కోట్ల ఓట్లు ఉన్నాయని.. అందులో బీజేపీ ఎన్ని దొంగలిస్తుందో ఒక్కసారి ఆలోచించండని అన్నారు. ఇప్పటి వరకు బీజేపీ వాళ్లు గొడవలు పెడతారని, అల్లరి చేస్తారని విన్నాం కానీ, ఇలా దొంగలిస్తారని తెలియదని విమర్శించారు. బీజేపీని ఓడించలేమని చెప్పే వారికి.. ఐక్యత, కృషితో ఓడించగలమని చెప్పడానికి ఇదే పెద్ద సంకేతం అని కేజ్రీవాల్ అన్నారు. కాగా.. చండీగఢ్ మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం అపూర్వమైన తీర్పును వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ను మేయర్గా ప్రకటిస్తూ.. అలాగే రద్దయిన ఆ 8 ఓట్లను కరెక్ట్ గా సుప్రీంకోర్టు ఆమోదించింది.
ఉక్రెయిన్లో రష్యా పైలట్ హత్య! నవాల్నీ మాదిరిగా చంపేశారా?
రష్యా నుంచి హెలికాప్టర్తో సహా ఉక్రెయిన్కు పారిపోయిన ఓ పైలట్ (Russian pilot) స్పెయిన్లో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వరంగ మీడియా వెల్లడించింది. పైలట్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని పేర్కొంది. పైలట్ మృతదేహాన్ని ఫిబ్రవరి 13న దక్షిణ స్పెయిన్లోని విల్లాజాయిసా దగ్గర గుర్తించినట్లు మీడియా పేర్కొంది. అది రష్యా పైలట్ మ్యాక్సిమ్ కుజ్మినోవ్దిగా ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. గతేడాది ఆగస్టులో అతడు ఎంఐ-8 హెలికాప్టర్తో సహా పారిపోయి కీవ్ పంచన చేరాడు. ఈ విషయం రష్యాకు అవమానకరంగా మారింది. ఆ తర్వాత ఉక్రెయిన్ పాస్పోర్టు లభించింది. దీంతో స్పెయిన్ వెళ్లి జీవిస్తున్నాడు. పైలట్ మ్యాక్సిమ్పై గత వారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు దుండగులు ఒక వాహనంలో వచ్చి దాడి చేసినట్లు సమాచారం. పోలీసులు గాలింపు చేపట్టగా.. దగ్ధమైన వాహనం దొరికింది. ఆ కాల్పుల్లో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మృతుడు నకిలీ గుర్తింపు పత్రాలతో దేశంలో నివసిస్తున్నట్లు వెల్లడించారు. అతడు రష్యా పైలట్ మ్యాక్సిమ్ అని ఉక్రెయిన్ నిఘా సంస్థ అధికారులు వెల్లడించారు.
మాజీ అధ్యక్షుడు జొవెనల్ మర్డర్ మిస్టరీ వీడింది! హంతకులెవరంటే..!
తీవ్ర సంచలనం సృష్టించిన హైతీ (Haiti) మాజీ అధ్యక్షుడు జొవెనల్ మోయిస్ (Jovenel Moise) హత్య కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ఆయన సతీమణి మార్టిన్ మోయిస్(Martine Moise) హస్తం ఉందని ఓ నివేదిక బయటకు వచ్చింది. హైతీ మాజీ ప్రధాని క్లాడ్ జోసెఫ్(Claude Joseph)తో కలిసి జోవెనల్ మోయిస్ హత్యకు ఆమె సహకరించారని ఆ నివేదిక పేర్కొంది. ఈ కేసుని విచారిస్తున్న ఓ అధికారి సంచలన నివేదికను విడుదల చేశారు. అంతేకాదు.. అప్పటి పోలీస్ చీఫ్ లియోన్ చార్లెస్ (Leon Charles)పై కూడా ఆ అధికారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హత్య, హత్యాయత్నం, అంతర్గత భద్రతకు వ్యతిరేకంగా కుట్ర వంటి అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఈ నివేదిక హైతీలో పెను దుమారమే రేపుతోంది. 2021లో హైతీ అధ్యక్షుడిగా ఉన్న జొవెనెల్ మోయిస్ (53) తన ప్రైవేటు నివాసంలోనే హత్యకు గురయ్యారు. అర్థరాత్రి సమయంలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన సతీమణి మార్టిన్ మోయిస్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఓ దేశాధ్యక్షుడే హత్యకు గురవ్వడంతో.. ఈ సంఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి ప్రధాని జోసెఫ్.. ఈ హత్యకు సాయుధ కమాండో గ్రూపు సభ్యులే కారణమని ఆరోపణలు చేశారు.
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈసారి ఇండియాలోనే ఐపీఎల్
క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ ఇండియాలో ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. భారత్ లోనే ఐపీఎల్ 2024 నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా.. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయని ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. లోక్ సభ, సార్వత్రిక ఎన్నికల కారణంగా ఇండియాలో కాకుండా.. దుబాయ్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. కానీ ఇండియాలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఐపీఎల్ 2024 రెండు దశల్లో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి తొలి 15 రోజుల షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించనుంది. లోక్సభ ఎన్నికల తేదీలు వచ్చాక.. మిగిలిన షెడ్యూల్ ప్రకటించనుంది. మార్చి మొదటి వారంలో తొలి దశ షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. గతేడాది టైటిల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్ ఉండనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో ఐపీఎల్ సీజన్ మొత్తాన్ని బీసీసీఐ దక్షిణాఫ్రికాలో నిర్వహించింది. 2014 సీజన్లో కూడా కొన్ని మ్యాచ్ లు యూఏఈలో నిర్వహించారు. అంతేకాకుండా.. 2019లో ఎన్నికలు ఉన్నా మొత్తం సీజన్ భారత్లోనే నిర్వహించింది బీసీసీఐ. తాజాగా.. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నా కూడా పూర్తిగా ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ భావించింది.
ఆడియన్స్ ను భయపెట్టేందుకు వచ్చేస్తున్న “తంత్ర”.. రిలీజ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగెళ్ల నటించిన లేటెస్ట్ చిత్రం “తంత్ర “. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్ అనన్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.ఇన్ని రోజులు గ్లామరస్, కూల్ క్యారెక్టర్స్ చేసిన ఈమె ఇప్పుడు హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.”ఈ క్రతవుకు మీరు తప్పకుండా రావాలి.. మార్చి 15న థియేటర్లలో ‘తంత్ర’ అనే పోస్టర్ ని ఆమె పోస్ట్ చేసింది. దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.’మల్లేశం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అనన్యా నాగళ్ల . ‘ప్లే బ్యాక్’ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అచ్చతెలుగు అమ్మాయిలా ఎన్నో పాత్రలు చేసిన అనన్య. ఇప్పుడు ‘తంత్ర’ సినిమాతో సరికొత్తగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాపై బాగా హైప్ క్రియేట్ చేశాయి.’కాలగర్భంలో కలసిపోయిన మన తాంత్రిక శాస్త్రాన్ని తెరిస్తే… అందులో ఊహకందని రహస్యాలు ఎన్నో’ అంటూ వచ్చిన ‘తంత్ర’ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఊరిలో దుష్టశక్తి పుట్టిందని మరో గొంతు వినిపిస్తుంటే… తెరపై క్షుద్రపూజలు వంటివి కనిపించాయి. ఇక ఆ టీజర్ లో ప్రతీ సీన్ కూడా భయపెట్టేలా ఉంది. ఇక ఈ సినిమాలో అనన్యతో పాటు.. మరో హీరోయిన్ సలోని తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. గ్లామర్ రోల్స్ చేసి మెప్పించిన సలోని ‘తంత్ర’లో డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు.ఈ మూవీని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వి ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలపై నరేష్ బాబు పి మరియు రవి చైతన్య నిర్మిస్తున్నారు.
తల్లి కాబోతున్న దీపికా పదుకొనే.. వైరల్ అవుతున్న ఫోటోలు..
బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల ఈ అమ్మడు నటించిన అన్నీ సినిమాలు బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అంతే కాదు తాను ప్రగ్నెంట్ అనే వార్త కూడా వైరల్ అవుతుంది.. అయితే దీపికా పదుకోన్ ఫిబ్రవరి 18న లండన్లో జరిగిన బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యాతలలో ఒకరిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో బంగారు, వెండి రంగుల కలయికలో ఉన్న చీరను ధరించి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది.. ఈ సందర్భంలో ఆమె చీర కొంగుతో తన బేబీ బంప్ను దాచుకోవడానికి ప్రయత్నించారంటూ అభిమానులు గుసగుసలు చెబుతున్నారు.. ఈ అమ్మడు రెడ్ కార్పేట్ పై నడుస్తూ తాను చీర కొంగును కప్పుకోవడంతో ఈ అనుమానాలకు తెర లేపింది.. ఇక ఆమె ఫ్యాన్స్ కూడా ఆమె ప్రగ్నెంట్ అనే నమ్ముతున్నారు.. బేబీ పదుకోన్ తప్పకుండా వస్తుంది’ అంటూ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితంలోకి చొరబడి కామెంట్స్ చేయడం సరికాదని విమర్శించారు.. 2018 లో ఈమె రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్నారు.. ప్రభాస్తో ‘కల్కి’, హిందీలో ‘సింగమ్ రిటర్న్స్’ సినిమాల్లో చేస్తున్నారు..