Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి స్వరాలపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత ప్రభుత్వం, పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా బహిరంగంగా విమర్శలు గుప్పించిన నేతలకు వరుసగా నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మంత్రి కొండా సురేఖతో పాటు సీనియర్ నేత, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డిలకు క్రమశిక్షణా కమిటీ నోటీసులు పంపించింది.
కొండా సుస్మితా వ్యాఖ్యలపై సురేఖకు ఆదేశాలు
వరంగల్లో నిర్వహించిన ఓ వేదికపై నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. రాబోయే ఎన్నికల్లో పరకాల అభ్యర్థిని ప్రకటించే హక్కు సీఎంబీకి ఎలా ఉంటుందని నిలదీస్తూ, అధిష్ఠానంతో సంబంధం లేకుండా తాను పరకాల నుంచే పోటీ చేస్తానని సుష్మిత బహిరంగంగా వ్యాఖ్యానించారు. సొంత ప్రభుత్వం, నాయకత్వంపై ఇటువంటి విమర్శలు చేయడం తీవ్ర క్రమశిక్షణా రాహిత్యమని స్పష్టం చేసిన అధిష్ఠానం, ఈ వ్యవహారంపై మూడు రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖను ఆదేశించింది.
Also Read
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్పై కీలక ఆదేశాలు.!
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
వనపర్తి రాజకీయంలో చిన్నారెడ్డికి నోటీసు
మరోవైపు వనపర్తి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చెలరేగిన వివాదం కూడా అధిష్ఠానం వద్దకు చేరింది. స్థానిక ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి జి. చిన్నారెడ్డికి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని సీట్లు కేటాయించడం వల్లే తనకు టికెట్ దక్కలేదని, దీని కారణంగానే వనపర్తి నియోజకవర్గం నాశనమైందని ఆయన బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ తీవ్రమైన కామెంట్స్ను పరిగణనలోకి తీసుకున్న క్రమశిక్షణా కమిటీ, తన వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని చిన్నారెడ్డికి స్పష్టం చేసింది.
లైన్ దాటితే సహించేది లేదని హెచ్చరిక
పార్టీ ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ పెద్దలపై లక్ష్మణ రేఖ దాటి బహిరంగ విమర్శలు చేస్తే ఏమాత్రం సహించేది లేదని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ హెచ్చరించింది. ఇద్దరు ప్రముఖ సీనియర్ నేతలకు ఒకేసారి షోకాజ్ నోటీసులు జారీ కావడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు పార్టీలోని అసమ్మతివాదులకు ఎలాంటి హెచ్చరికగా మారనున్నాయో వేచి చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!