AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: కోర్టు ఆదేశాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న అంశంపై ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వివిధ కేసుల్లో కౌంటర్లు, స్థాయి నివేదికలు, మెమోలు దాఖలు చేయాలని ఆదేశిస్తున్నప్పటికీ అధికారులు వాటిని తేలిగ్గా తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చాలా కేసుల్లో విచారణకు ముందు రోజు లేదా విచారణ జరిగే రోజే కౌంటర్లు, నివేదికలు దాఖలు చేస్తున్నారని హైకోర్టు పేర్కొంది. ఈ విధానం సరైనది కాదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను సకాలంలో అమలు చేసి, అవసరమైన వివరాలను ముందుగానే సమర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది.
అధికారులపై కఠినంగా వ్యవహరించాలి
కౌంటర్లు, నివేదికలు సమర్పించడంలో జాప్యం చేస్తున్న అధికారుల విషయంలో ఉదారంగా వ్యవహరించవద్దని అడ్వొకేట్ జనరల్కు హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అధికారులు గౌరవించేలా చర్యలు తీసుకోవాలని, నిర్దేశించిన సమయంలోనే వివరాలు సమర్పించేలా చూడాలని ఏజీకి సూచించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు భావించవద్దని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయినప్పటికీ సకాలంలో నివేదికలు సమర్పించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Off The Record: బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ లిస్టులో దానం నాగేందర్.. కాంగ్రెస్కు కూడా భారమేనా?
పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపై పిల్
ఇదిలా ఉండగా, పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కూడా ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా పిటిషన్ నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ రెండు పిటిషన్లను బుధవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం.. సంబంధిత వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. అయితే నివేదికలు దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫున మరింత సమయం కోరడంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలులో ఇకపై ఇలాంటి జాప్యాలు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.
తాజావార్తలు
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
-
Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!