Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Top Headlines 5 Pm On December 9th 2023

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

NTV Telugu Twitter
Published Date :December 9, 2023 , 5:00 pm
By Mahesh Jakki
Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

*తెలంగాణ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ ‘మహాలక్ష్మి’ ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ముందు మహిళా మంత్రులు కొండా సురేఖా, సీతక్క, సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పలువురు ఎమ్మెల్యేలు, , రవాణా శాఖ సెక్రటరీ వాణిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బస్సులో ప్రయాణం చేశారు. ఈ నేపథ్యంలో.. సిటీ బస్సులో ప్రయాణించిన సీఎం రేవంత్.. జర్నలిస్టులు, ఇతర ప్రముఖులకు ఉచిత బస్సు ప్రయాణ టికెట్ అందించారు. అయితే, మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఉచితంగా ప్రయాణించగా రేవంత్ మాత్రం డబ్బులు చెల్లించి టికెట్ తీసుకున్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమవడంతో.. మహిళలు బస్సులు ఎక్కి ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ స్కీమ్ పై పలువురు మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా.. తెలంగాణకు చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా నడిచే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ఈ క్రమంలో.. 7292 బస్సుల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ను జారీ చేస్తారు. లోకల్ పోలరైజేషన్ కోసం ప్రయాణ సమయంలో కండక్టర్లకు గుర్తింపు కార్డులు చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వం TSRTCకి ఖర్చును రీయింబర్స్ చేస్తుంది.

 

*తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం వరుస సమావేశాలతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేసింది. ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఏడుగురు సలహాదారుల నియామకాలను సీఎస్ ర‌ద్దు చేశారు. ప్రభుత్వ సలహాదారులైన సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రాజీవ్ శర్మ, ఇరిగేషన్ అడ్వైజర్‌గా ఉన్న ఎస్కే జోషి, సాంస్కృతిక, దేవాదాయ సలహాదారుగా కేవీ రమణా చారి(ఇటీవల రాజీనామా చేశారు), అటవీ సంరక్షణ శాఖ ముఖ్య సలహాదారుగా శోభ, హోంశాఖ సలహాదారుగా అనురాగ్ శర్మ, ముస్లిం మైనారిటీ సంక్షేమ సలహాదారుగా ఏకే ఖాన్, ఫైనాన్స్ డిపార్టుమెంట్‌లో స్పెషల్ ఆఫీసర్ హోదాలో జీఆర్ రెడ్డి, శివశంకర్, ఆర్ అండ్ బీ శాఖలో సుధాకర్ తేజ, అగ్రికల్చర్ ముఖ్య సలహాదారు చెన్నమనేని రమేష్, ఇంధన సెక్టార్‌లో రాజేంద్ర ప్రసాద్ సింగ్, ఉద్యాన శాఖలో శ్రీనివాస్ రావు ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

 

*పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు.. రాష్ట్ర సర్కార్ ను హరీష్‌ రావు ప్రశ్న
పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నం కాబట్టి విమర్శ చేయాలని కాదన్నారు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని తెలిపారు. రైతులకు బోనస్ ఇస్తాం అని ఎన్నికల సమయంలో చెప్పారు బోనస్ కింది 5 వందల రూపాయలు ఇస్తాం అన్నారని తెలిపారు. వడ్లకు 5 వందల బోనస్ ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. వడ్లు కొనుగోలు ఎప్పుడు చేస్తారు చెప్పాలి అని అడుగుతున్నామని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రైతు బంధు పెంచుతాం అన్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రైతు బంధు కింద 15 వేల రూపాయలు ఇస్తామని, డిసెంబర్ 9 న ఇస్తాం అని మాట ఇచ్చారని గుర్తు చేశారు. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నామని హరీష్‌ రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కాకుండా మరొకరు వస్తారనే ఊహాగానాలు ఇటీవల జోరందుకున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి రారని, పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లో బిజీ అవుతారని కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కు అలాంటి ఆలోచన లేదని తేలిపోయింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. అంటే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోరు మొదలవుతుందని తెలుస్తోంది. కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మరింత అగ్గి రాజేస్తున్నాయి. విద్యుత్ శాఖ విషయంలో గత ప్రభుత్వం మోపిన భారంపై ఇప్పటికే కాంగ్రెస్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు… ఆసక్తికరంగా మారాయి. బీఆర్‌ఎస్ నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. కాబట్టి వారు రెండు స్థానాల్లో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈరోజు అసెంబ్లీకి రాకముందే ముగ్గురు ఎమ్మెల్సీలు శాసనమండలికి వెళ్లి రాజీనామాలు సమర్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిల రాజీనామాలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు.

 

*ఆరోగ్యశ్రీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్‌ రెడ్డి ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన వేళ.. ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చును 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తుందని అధికారులు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యానికి రూ.10 లక్షలకు రేవంత్ రెడ్డి సర్కార్ పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఇది నేటి నుంచి అమలులోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,310 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను అందించబోతున్నారు. 293 ప్రైవేట్‌ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్‌సీలలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్య శ్రీ పథకం కింద 1,376 శస్త్ర చికిత్సలు, 289 వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

 

*క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్.. 9 సంస్థలతో ఏపీ సర్కార్‌ ఒప్పందాలు
గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగిఉన్న క్రీడలను వెలికితీసింది ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్.. అందులో భాగంగా క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్ పెడుతోంది.. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.. యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ఒప్పందాలు చేసుకుంటుంది.. 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం.. మరో రెండు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కడ్డీ లీగ్, ప్రైమ్ వాలీబాల్ లీగ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, ఏపీ బ్యాడ్మెంట్ అసోసియేషన్ తో ఒప్పందాలు కుదుర్చుకుంది ఏపీ సర్కార్.. ఇక, పీవీ సింధు, ఆంధ్రా ఖో ఖో అసోసియేషన్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రా వాలీబాల్ అసోసియేషన్ తోనూ ఒప్పందాలు చేసుకుంది.. ఈ సంస్థల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ సెర్చ్‌ చేపట్టనున్నారు.. ఇక, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో చర్చలు సాగిస్తున్నారు. రాబోయే ఐపీఎల్, పీకేఎల్, పీవీఎల్ సీజన్స్ లలో ఏపీ క్రీడాకారులకు అవకాశాలు కలిపించే దిశగా చర్యలకు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

 

*ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్.. డిసెంబర్ 17న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్‌‌ మనదేశంలోనే ప్రారంభం కాబోతోంది. వజ్రాల పరిశ్రమకు ఫేమస్ అయిన గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఈ బిల్డింగ్ నిర్మించబడింది. కొత్తగా నిర్మించింది. సూరత్ డైమండ్ బోర్స్ (SDB) భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 17న ప్రారంభించనున్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి, దాదాపు 4,500 డైమండ్ ట్రేడింగ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భవన నిర్మాణం ఫిబ్రవరి 2015లో ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్టులో డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్(డ్రీమ్) సిటీలో భాగంగా ఉన్న ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. 35.54 ఎకరాల ప్లాట్‌లో నిర్మించిన ఈ భారీ బిల్డింగ్ తొమ్మిది టవర్లతో పాటు 15 అంతస్తులను కలిగి ఉంది. 300 చదరపు అడుగుల నుంచి 1 లక్ష చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్థలాలు ఉన్నాయి. 9 దీర్ఘచతురస్రాకార టవర్లు సెంట్రల్ స్పైన్‌తో అనుసంధానించబడి ఉన్నాయి. ఈ భవనానికి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(IGBC) నుంచి ప్లాటినం ర్యాంకింగ్ పొందింది. డిసెంబర్ 17న భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 70,000 మందికి ఆహ్వానాలు పంపారు. ఇప్పటికే గత కొన్ని వారాలుగా పలు వజ్రాల వ్యాపార సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించాయి, 65,000 మంది వజ్రాల నిపుణులకు అనుకూలంగా ఈ భవనం ఉండబోతోంది. ఆఫీసులతో పాటు, డైమండ్ బోర్స్ క్యాంపస్‌లో సేఫ్ డిపాజిట్ వాల్ట్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, రెస్టారెంట్‌లు, బ్యాంకులు, కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్‌లు, ట్రైనింగ్ సెంటర్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియాలు, రెస్టారెంట్లు మరియు సెక్యూరిటీతో పాటు క్లబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

 

*”అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో అంతర్భాగం”.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై హిమంత ఆగ్రహం..
అస్సాంపై సీనియర్ న్యాయవాది, రాజకీయ నాయకుడు కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో అంతర్భాగం’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ ఘాటుగా స్పందించారు. మీకు తెలియకుంటే మాట్లాడవద్దని హెచ్చరించారు. 1955 పౌరసత్వం చట్టంలోని సెక్షన్ 6ఏ చెల్లుబాటు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తన వాదనలను వినిపిస్తూ కపిల్ సిబల్ అస్సాంపై మాట్లాడారు. ‘‘ మీరు అస్సాం చరిత్రను పరిశీలిస్తే ఎవరు ఎప్పుడు వచ్చారో గుర్తించడం అసాధ్యం, అస్సాం వాస్తవానికి మయన్మార్‌లో ఒక భాగం. 1824లో బ్రిటిష్ వారు ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఒప్పందంలో భాగంగా బ్రిటిష్ వారికి మయన్మార్ అస్సాంని అప్పగించింది’’ అని అన్నారు. మణిపూర్‌లో మైయిటీలు, కుకీలకు జాతి ఘర్షణల తర్వాత కుకీల తరుపున కూడా కపిల్ సిబలే వాదిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అస్సాం సీఎం, ఈశాన్య రాష్ట్రాల స్ట్రాటిజస్ట్‌గా పేరున్న హిమంత్ బిస్వ సర్మ, కపిల్ సిబల్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ‘‘ అస్సాం చరిత్ర గురించి అవగాహన లేని వారు మాట్టాడవద్దని, అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగం కాదు. కొంతకాలం దీనిపై గొడవలు జరిగాయి. అంతే తప్పా.. అస్సాం మయన్మార్‌లో భాగమని చెప్పే ఏ సమాచారాన్ని ఇంతవరకు చూడలేదు’’ అని సీఎం హిమంత ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

*”కార్గిల్ యుద్ధాన్ని వద్దన్నందుకే నన్ను తొలగించారు”.. పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) అధినేత నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌‌లో జరిగిన కార్గిల్ యుద్ధాన్ని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భారతదేశంతో సత్సంబంధాల ప్రాముఖ్యతను చెప్పినందుకు, కార్గిల్ ప్లాన్ వ్యతిరేకించినందుకు అప్పటి జనరల్ పర్వేజ్ ముషారప్ 1999లో తన ప్రభుత్వాన్ని దించేశారని శనివారం అన్నారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన తనను ముందస్తుగా ప్రధాని పదవి నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. ‘‘ నేను 1993, 1999లో ఎందుకు ప్రధాని పదవి నుంచి తొలగించబడ్డానో చెప్పాలి. నేను కార్గిల్ ప్లాన్‌ని వ్యతిరేకించినప్పుడు, నన్ను(జనరల్ పర్వేజ్ ముషారఫ్) పదవీ నుంచి దింపేశాడు. ఆ తర్వాత నేను చెప్పింది నిజమే అని తేలింది.’’ అని షరీఫ్ అన్నారు. వచ్చే ఫిబ్రవరిలో పాక్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇద్దరు భారత ప్రధానులు పాకిస్తాన్‌లో పర్యటించారు. దీనిని గురించి ఆయన మాట్లాడారు. వాజ్‌పేయి, నరేంద్రమోడీ లాహోర్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నవాజ్ భారతదేశంతో సంబంధాల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలతో మన సంబంధాలు బలపరుచుకోవాలి, చైనాతో మరింత బలమైన సంబంధాలను ఏర్పరుచుకోవాలి అని షరీఫ్ అన్నారు. ఆర్థిక వృద్ధిలో పాక్ పొరుగుదేశాల కన్నా వెనకబడి ఉందని ఆయన విచారం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విరుచుకుపడిన షరీఫ్.. అనుభవం లేని వ్యక్తి దేశ పగ్గాలు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంతో పాక్ ఆర్థిక వ్యవస్థ పతానానికి గురైందని, ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం గద్దెనెక్కి దేశాన్ని డిఫాల్ట్ నుంచి రక్షించిందని ఆయన అన్నారు. 2017లో తన ప్రభుత్వాన్ని దించేసి దేశాన్ని నాశనం చేసినందుకు మాజీ సైనిక జనరల్స్, న్యాయమూర్తులు జవాబుదారీ వహించాలని షరీఫ్ డిమాండ్ చేశారు. దేశ భక్తి ఉన్న వారు తమ దేశాన్ని ఇలా చేయరని మండిపడ్డారు. విలాసవంతమైన కార్లలో తిరిగేందుకు తాను అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, అయితే దేశాన్ని నాశనం చేసిన వారు, తనపై తప్పుడు కేసులు బనాయించి వారు జవాబుదారీగా ఉండాలన్నారు. యూకేలో 4 ఏళ్లు ప్రవాసంలో గడిపిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవల సొంత దేశానికి వచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ టిక్కెట్ల కోసం షరీఫ్ ప్రతిరోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

 

*మహ్మద్ ప్రవక్తని కించపరిచాడని ఫ్రెంచ్ టీచర్ శిరచ్ఛేదం.. దోషులుగా 6 టీనేజర్లు..
ఫ్రాన్స్‌తో పాటు బెల్జియం, ఇతర యూరోపియన్ దేశాల్లో ఇస్లాం రాడికలైజేషన్ పెరుగుతోంది. పలువురు ఆయా దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే 2020లో ఫ్రెంచ్ ఉపాధ్యాయుడు శామ్యూల్ పాటీని తల నరికి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ కేసులో ఆరుగురు టీనేజర్లను ఫ్రెంచ్ కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. శామ్యూల్స్ తన క్లాసులో భావప్రకటన స్వేచ్ఛపై క్లాస్ చెబుతూ.. మహ్మద్ ప్రవక్తకు సంబంధించి వ్యంగ్య చిత్రాలను చూపించాడని, ఇది కొంతమంది ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులకు కోపం తెప్పించింది. దీనిని కొందరు దైవదూషణగా భావించారు. అయితే దోషులుగా ఉన్న ఆరుగురు టీనేజర్లలో ఒక బాలిక, వ్యంగ్య చిత్రాలను చూపించే ముందు శామ్యూల్స్ పాటీ ముస్లిం విద్యార్థులను క్లాస్ రూం నుంచి బయటకు వెళ్లాలని చెప్పినట్లు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఈ రోజు బాలిక క్లాస్ రూపంలోనే లేదని కోర్టు గుర్తించింది. తప్పుడు ఆరోపణలు, దూషణాత్మక వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు ఆమెను కూడా దోషిగా నిర్ధారించింది.

 

*ఐఏఎస్‌తో పెళ్లికి రెడీ అయిన మెహ్రీన్ మాజీ ప్రియుడు.. 3 లక్షల మందికి ఆహ్వానం!
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు, బీజేపీ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఐఏఎస్‌ ఆఫీసర్‌ పరి బిష్ణోయ్‌ని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నెల 22న వీరి వివాహం జరగనుంది. అయితే ఇందులో పెద్ద విశేషమేముంది అనుకోవచ్చు..కానీ ఈ పెళ్లికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఢిల్లీతో సహా రెండు రాష్ట్రాలకు ఇన్విటేషన్లు వెళ్లాయి. వేధిక రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో కాగా .. పుష్కర్, అదంపుర్‌, ఢిల్లీ నగరాలు మూడు రిసెప్షన్లకు వేదిక కానున్నాయి. ఈ వేడుకల నిమిత్తం మూడు లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లనున్నాయి. దీంతో ఇప్పుడు ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. భవ్య.. అదంపుర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తాత భజన్‌ లాల్‌ హర్యానాకు పదమూడేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. తండ్రి కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ భాజపా నేత, మాజీ ఎంపీ. పరి బిష్ణోయ్‌ది రాజస్థాన్‌. ఆమె 2019లో సివిల్స్‌ సాధించారు. సిక్కిం క్యాడర్‌ కింద గ్యాంగ్‌టక్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. పెళ్లి కూతురు రాష్ట్రమైన రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వివాహం జరగనుంది. అలాగే ఆ రాష్ట్రంలోని పుష్కర్‌ నగరంలో ఒక రిసెప్షన్ నిర్వహించనున్నారు. భజన్‌లాల్ కాలం నుంచి బిష్ణోయ్ కుటుంబానికి మంచి పట్టున్న అదంపుర్‌ రిసెప్షన్‌కు వేదిక కానుంది. దాంతో ఆ నియోజకవర్గంలోని 80కి పైగా గ్రామాలకు చెందిన ప్రజలను ఆహ్వానిస్తున్నారు. నా తండ్రి భజన్‌లాల్ కూడా నా వివాహం సమయంలో అన్ని ఊర్లు తిరిగి ప్రజలను ఆహ్వానించారని.. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఇప్పుడు తాను కూడా అదే చేయబోతున్నాని పెళ్లి కుమారుని తండ్రి కుల్‌దీప్ బిష్ణోయ్‌ తెలిపారు. ఢిల్లీ రిసెప్షన్‌కు పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. భవ్య బిష్ణోయ్‌కు 2021లో సినీనటి మెహ్రీన్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే కొద్దినెలలకే వారి ఎంగేజ్‌మెంట్ రద్దయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cricket
  • telangana
  • Tollywood
  • Top Headlines @ 5 PM

తాజావార్తలు

  • GT vs MI IPL 2025 Eliminator: క్వాలిఫయర్-2కి ముంబై.. ఇంటికి గుజరాత్‌..

  • Off The Record: అన్నా చెల్లెళ్ల పంతం ఎంతదాకా వెళ్తుంది..? ఈసారైనా రాఖీ పండుగ ఉంటుందా..?

  • Off The Record: వల్లభనేని వంశీ విడుదల ఎప్పుడు..? లైన్ లో ఇంకా కేసులు ఉన్నాయా..?

  • Off The Record: ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు.. జేసీ కామెంట్లతో టీడీపీ ఇరుకున పడుతుందా..?

  • Nigeria Floods: నైజీరియాను ముంచెత్తిన వరదలు.. 111 మంది మృతి

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions