Janasena: జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Kayagurala Lakshmipathi Joins Janasena: కేఎల్పీ మూవీస్ సంస్థ అధినేత, నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు. సోమవారం (జనవరి 29) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీపతి తండ్రి గారు కీ.శే. శ్రీ కె. నారాయణస్వామి గారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి గారి స్ఫూర్తితో నిర్మాత లక్ష్మీపతి కూడా ప్రజాసేవ చేయడానికి నేడు జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీలో చేరిన సందర్భంగా కాయగూరలు లక్ష్మీపతి మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో అభిమానం. గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నా. సినిమా అంటే ఇష్టంతో ఐక్యూ సినిమాను నిర్మించా. ఇంకా రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ లభిస్తోంది. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. బిజినెస్ రంగంలో నాకు సపోర్ట్ చేస్తున్న నా తోటి మిత్రులకు కృతజ్ఞతలు. సినిమాలు నిర్మిస్తూనే.. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తా. ప్రజల కోసం పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. జనసేన పార్టీ నుంచి ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు.
Also Read
- Dharmendra Pradhan: షాకింగ్.. రెండు సార్లు రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కానీ..
- BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
- Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..
- Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
Also Read: MK Stalin-Djokovic: ఆకాశంలో ఆశ్చర్యం.. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ను కలిసిన తమిళనాడు సీఎం!
కాయగూరల లక్ష్మీపతి గతంలో ఆర్టిఏ బోర్డు మెంబర్గా, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్గా అనంతపురం పట్టణ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేశారు. అనంతపురంలో ప్రభుత్వ స్థలంలో శాశ్వత ఆర్టిఓ కార్యాలయంను నిర్మించుటకు కృషి చేసి.. నిర్మాణం పూర్తి చేశారు. టెలికం ఎస్టిడి, ఐఎస్డి కమిటీ మెంబర్గా పని చేసిన కాలంలో పార్టీ కార్యకర్తలకు ఎస్టిడి బూతులు కేటాయించి బ్యాంకు రుణాలు ఇప్పించారు. కెఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో పేదలకు నీళ్ల ట్యాంకు నిర్మాణం, దుప్పట్లు, చేతి కర్రలు పంచారు. అఖిలభారత కాపు సమాఖ్యలో ప్రధాన కార్యదర్శిగా ఉంటూ.. కాపు, బలిజల సంఘాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
తాజావార్తలు
-
Newtons 3rd Law: పోలీస్ ఆఫీసర్గా సుమంత్.. ‘న్యూటన్స్ థర్డ్ లా’ ట్రైలర్లో అదిరిపోయిన ట్విస్టులు
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
Dharmendra Pradhan: షాకింగ్.. రెండు సార్లు రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కానీ..
-
Rahul Gandhi: ‘విద్యార్థులను చంపమని ఎవరు ఆదేశించారు?’ అమిత్ షాకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ తీవ్రమైన ప్రశ్నలు
-
BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!