దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ట్రేడింగ్ ప్లాట్ గా ముగిసింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ స్వల్ప లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ స్వలంగా నష్టపోయింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, దేశీయ కార్పొరేట్ పనితీరు, ముందస్తు ఎన్నికల ర్యాలీలతో సెన్సెక్స్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల విక్రయాలు ప్రారంభమైనప్పుడు, సూచీ లాభనష్టాలతో విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనైంది.
సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో ఇంట్రాడే గరిష్ట స్థాయి 74,359ని తాకింది. ఆ తర్వాత నష్టాల్లోకి దిగుతూ 73,786 కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇక చివరగా 17 పాయింట్లు పెరిగి 73,895 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,442 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 28 పాయింట్లు నష్టపోయింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.83.50గా కొనసాగుతున్నది.
Also Read: 2024 ICC Women’s T20 World Cup: పొట్టి ప్రపంచకప్కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు..
ఇక నేటి టాప్ గైనేర్స్, లూజర్స్ విషయానికి వస్తే.. సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా కొటక్ బ్యాంక్ (5.01%), టీసీఎస్ (2.13%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.80%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.47%), సన్ ఫార్మా (1.40%) గా ఉండగా., మరోవైపు టాప్ లూజర్స్ గా టైటాన్ (-7.18%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.86%), ఎన్టీపీసీ (-2.31%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.22%), ఎల్ అండ్ టీ (-1.06%) ఉన్నాయి.