YSRCP: ఒంగోలు ఎంపీ సీటుపై తొలగిన అనిశ్చితి..! ఆయనకు లైన్ క్లియర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఎన్నికల వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతుంది.. ఇప్పటికే రెండు లిస్ట్లు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం.. మూడో జాబితా కూడా సిద్ధం చేసింది.. ఈ రోజు మూడో జాబితాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.. అయితే, రెండు జాబితాలతో ఇప్పటికే ఈ సారి నో టికెట్ అని తేల్చేసింది.. మరికొందరి స్థానాలు మార్చేసింది.. ఇదే సమయంలో.. ఒంగోలు ఎంపీ సీటుపై ఎవరికి? అనే చర్చ సాగుతూ వచ్చింది.. ఈ సారికి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సీటు ఇచ్చే అవకాశం లేదనే చర్చ సాగింది.. అంతేకాదు.. ఆయన టీడీపీవైపు చూస్తున్నారని.. వైసీపీ టికెట్ రాకుంటే.. ఫ్యాన్ కింద నుంచి జరిగి.. సైకిల్ ఎక్కడం ఖాయమనే ప్రచారం విస్తృతంగా సాగింది.. అయితే, ఒంగోలు ఎంపీ సీటు విషయంలో అనిశ్చితి తొలగినట్లు సమాచారం..
Read Also: Shiva Stotram: ఈ స్తోత్రాలు వింటే ప్రస్తుత, పూర్వ జన్మ పాపముల నుండి విముక్తి
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
విజయవాడలో సోమవారం అర్ధరాత్రి వరకు ఎంపీ మాగుంట, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డితో ఐ ప్యాక్ ప్రతినిధి సమావేశం అయ్యారు.. రెండు గంటల పాటు మాగుంట, బాలినేనితో ఐ ప్యాక్ సుదీర్ఘ మంతనాలు సాగించింది. చర్చల్లో పలు కీలక అంశాలు కొలిక్కివచ్చాయట.. మొత్తంగా ఒంగోలు ఎంపీగా మాగుంట పోటీకి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. మాగుంట విషయంలో ఆదినుంచి పట్టుపడుతూ వచ్చిన బాలినేని.. మొత్తంగా అందరినీ ఒప్పించగలిగారట.. పలువురు నియోజకవర్గాల ఇంచార్జుల మార్పులు, చేర్పుల విషయంలో కూడా పంచాయతీ ఓ కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం.. అన్నీ పూర్తయితే ప్రకాశం జిల్లా వైసీపీలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, సంతనూతలపాడు, కొండేపి, అద్దంకి మార్పులు పూర్తి కాగా.. మరో రెండు నియోజకవర్గాల్లో కసరత్తులు పూర్తి చేసింది వైసీపీ అధిష్టానం.. మిగతా చోట్ల కూడా ఓ క్లారిటీకి వచ్చారట వైసీపీ అధిష్టానం పెద్దలు.. ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో బాలినేని శ్రీనివాస్రెడ్డి సమావేశం కానుండగా.. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి వైసీపీ శ్రేణులు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!