Komaram Bheem: కుమ్రం భీంజిల్లాలో రెండు పులులు మృతి.. పులి కళేబరాన్ని గుర్తించిన అటవీ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komaram Bheem: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి మృతి కలకలం రేపుతోంది. కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో ఆదివారం ఓ పులి మృతి చెందింది. కాగజ్ నగర్ టైగర్ రిజర్వ్లో గత రెండు నెలలుగా పులులు పలు ఆవులపై దాడి చేసి చంపిన ఘటనలు సంగతి తెలిసిందే.. అయితే ఆదివారం దరిగాం అటవీ ప్రాంతంలో పులి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. గ్రామస్తుల సమాచారంతో సీసీఎఫ్ శాంతా రాం, అటవీశాఖ అధికారులతో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దరిగాం అటవీ ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలోనే రెండు పులులు మృతి చెందాయి. టెరిటోరియల్ ఫైట్ లో ఒక పెద్దపులి మృతి చెందగా ఆ ప్రాంతం సమీపంలో మూడు సంవత్సరాల వయసు గల మరో పులి కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించారు. నేడు అటవీ ప్రాంతాన్ని పీసీసీఎఫ్ రాకేశ్ డోబ్రియల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పరగ్వేన్ సందర్శించారు.
Read also: Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. రిక్ట్కర్ స్కేల్పై 6.7 తీవ్రత!
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పులుల మధ్య ఘర్షణ జరిగి తీవ్ర గాయాలపాలై ఓ పులి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పులి మృతిపై అటవీశాఖ అధికారులు ఆదివారం కాగజ్ నగర్ అటవీశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సీసీఎఫ్ శాంత రాం మాట్లాడుతూ.. ఆశ్రయం కోసం రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో పెద్దపులి చనిపోయిందని తెలిపారు. ఈ ఘటన దాదాపు ఐదు రోజుల క్రితం జరిగి ఉండొచ్చని తెలిపారు. పులి చనిపోయిందని తెలియడంతో అధికారులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులికి పోస్ట్ రూట్ నిర్వహించి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్లు వెల్లడించారు. నివాసం కోసం రెండేళ్ల పులుల మధ్య జరిగిన పోరులో ఓ పులి చనిపోయిందని తెలిపారు. పులి మెడ, తలపై బలమైన గాయాలు ఉండడంతో రెండు పులుల మధ్య ఘర్షణ వల్లే చనిపోయి ఉంటుందని చేశారు. పోస్ట్మార్టం అనంతరం NTCA నిబంధనల ప్రకారం చనిపోయిన పులిని ఖననం చేశారు.
Brazil: బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి
తాజావార్తలు
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!