Tirumala Leopard: మళ్లీ చిరుత కలకలం.. ఈవో ఇంటి దగ్గర సంచారం.. నడకదారిలో టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Leopard: తిరుమల నడక దారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.. ఇప్పటికే తిరుమలలో ఆరు చిరుతలు బోనుకు చిక్కాయి.. ఓ బాలుడు, చిన్నారి లక్షితపై దాడి తర్వాత అప్రమత్తమైన టీటీడీ.. ఫారెస్ట్ అధికారులతో కలిసి ‘ఆపరేషన్ చిరుత’ చేపట్టారు.. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.. చిరుత సంచారాన్ని గుర్తించి బోన్లు ఏర్పాటు చేయడంతో.. ఇప్పటికే ఆరు చిరుతలను బంధించారు.. ఇక, దాదాపు వారం రోజుల పాటు ట్రాప్ కెమెరాలకు చిరుతల సంచారం చిక్కకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. నడకదారిలో భక్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.. చిరుతలు ఇక లేవు అనే నిర్ణయానికి కూడా వచ్చారు టీటీడీ అధికారులు.. కానీ, మళ్లీ ట్రాప్ కెమెరాకు చిరుత సంచారం చిక్కడంతో ఆందోళన మొదలైంది.. రాత్రి.. టీటీడీ ఈవో ఇంటి సమీపంలో చిరుత సంచారాని ట్రాప్ కెమరాలు ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇక, ఆ చిరుతను కూడా బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Minister KTR: నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
మరోవైపు.. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ బృందం తిరుమలలో పర్యటించనుంది.. తిరుమల నడకదారిలో ఇనుప కంచే ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించనుంది వైల్డ్ లైఫ్ కమిటీ.. నడక దారిలో ఇనుప కంచే ఏర్పాటుపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. కంచే ఏర్పాటుపై అనుమతులు మంజూరు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచివుండే అవసరం లేకుండానే నేరుగా శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు.. నిన్న 55,747 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 21,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.11 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.
తాజావార్తలు
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!