Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాక్ రక్షణ మంత్రి కీలక ప్రకటన
- ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ వదంతులు
- పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు నిరసనలు
- ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన పాక్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. రావల్పిండిలోని జైలు దగ్గర నిరసనలు చేపట్టారు. ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమకు చూపించాలంటూ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Hong Kong: హాంగ్ కాంగ్లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది సజీవదహనం
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారన్న వార్తలను రావల్పిండి జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని.. మంచి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్కు ఫైవ్స్టార్ హోటల్లో కంటే మెరుగైన ఆహారం అందుతోందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ప్రస్తుతం జైల్లో ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: US: వైట్హౌస్ దగ్గర కాల్పులు.. ఇద్దరు నేషనల్ గార్డ్స్కు సీరియస్!
ఇక ఇమ్రాన్ ఖాన్ను చూపించాలని సోదరీమణులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 2న కలిసేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ను మరొక జైలుకు తరలిస్తున్నారన్న వార్తలను అధికారులు ఖండించారు. ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు.
అవినీతి ఆరోపణలపై 2023 నుంచి రావల్పిండి అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అక్కాచెల్లెళ్లు ఆయనను కలిసేందుకు అధికారులు అనుమతించకపోవడం అనుమానాలు రేకెత్తాయి. చివరకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు సీఎంను కూడా అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే హత్యకు గురయ్యారంటూ పుకార్లు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని పాక్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?