Tiger Hulchul: ఏలూరు జిల్లాలో పులి కలకలం.. భయాందోళనలో ప్రజలు
Tiger Hulchul: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారి గూడెంలో పెద్దపులి సంచారం హడాలెత్తిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని రెండు ఆవులు, ఒక దూడపై పులి దాడి చేసింది. తెల్లవారుజామున పొలంలోకి వెళ్లిన రైతులు గాయపడిన ఆవులను చూసి పులి దాడి జరిగినట్టుగా గుర్తించారు. ఘటనా స్థలంలో పులి పాదముద్రలు గుర్తించారు. దెందులూరు, ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో పులి ఎక్కువగా సంచరిస్తుంది. పులి కదలికలను గుర్తించేందుకు ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఆరు బృందాలుగా గాలిస్తున్నారు. రోజుకు 40 కిలోమీటర్ల పరిధిలో పులి సంచారం కొనసాగడంతో బోను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. పులి సంచారంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. పొలాలకు వెళ్లాలంటే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులిని త్వరగా బంధించాలని అధికారులను కోరుతున్నారు.
Read Also: Pending Challans: మూడురోజులే గడువు.. పెండింగ్ చలాన్లు కట్టని వారు కట్టేయండి బాబు..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాసులను పెద్దపులి హడలెత్తిస్తోంది. ఒక్కోచోట ఒక్కోరకంగా పులి పాదముద్రలు.. సంచరించేది పెద్దపులి ఒక్కటేనా.. రెండా అనే అనుమానం కలుగుతోంది. గత వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. నిన్న దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించారు.రైతులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. పాదముద్ర ఆధారంగా పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. 13 సెంటీమీటర్ల పైగా పాదముద్రలు ఉంటే పులి సంచారం ఉన్నట్టు నిర్ధారిస్తారు. నాలుగు రోజుల క్రితం నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఆవు దూడలపై పులి దాడి చేసింది. అనంతరం ద్వారకాతిరుమలలో మండలంలో ఆవులపై దాడి చేసి తినేసింది. రాత్రి మరోసారి ద్వారకాతిరుమల మండలం దేవినేని వారి గూడెంలో ఆవులపై పులి దాడి చేసింది
ఒక్కోచోట ఒక్కోరకంగా పాదముద్రలు ఉండడంతో… సంచరించేది ఒక్కటేనా లేక రెండా అనే అనుమానం కలుగుతోంది. పోలవరం కుడికాలువ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ఎక్కువగా సంచరిస్తున్నట్లు తెలిసింది. గడిచిన వారం రోజుల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో పులి సంచరిస్తోంది.ఇప్పటికే పెద్దపులి జాడ తెలుసుకునేందుకు ఆరు బృందాలుగా ఏర్పడి అటవీ శాఖ సిబ్బంది గాలిస్తున్నారు. పులి సమాచారం కోసం అటవీ సిబ్బంది టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల పాక దగ్గర వెలుతురు ఎక్కువ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో