West Bengal: బెంగాల్లో పిడుగుపాటు.. 12 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి 12 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు చెప్పారు. మరోవైపు.. హరిశ్చంద్రాపూర్లో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా.. పిడుగుపాటుకు గురై మృతి చెందిన.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా ప్రకటించారు. పిడుగుపాటుకు మృతి చెందిన వారికి విపత్తు నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తామని తెలిపారు. అన్ని రకాల ప్రభుత్వ సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.
Match Fixing: లెజెండ్స్ క్రికెట్ లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్.. ఇద్దరు ఇండియన్స్ పాస్పోర్ట్ సీజ్
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
గురువారం మధ్యాహ్నం మాల్దాలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో.. పిడుగుపాటుకు ఓల్డ్ మాల్డాలోని సహపూర్లో మైనర్తో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మృతులు చందన్ సాహ్ని (40), మనోజిత్ మండల్ (21), రాజ్ మృధ (16)గా గుర్తించారు. గాలి ధుమారానికి మామిడికాయలు రాలిపోతే.. వాటిని తీసుకొస్తున్న క్రమంలో మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు.. గజోల్లోని ఆదినాలో పిడుగుపాటుకు ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మానిక్చక్ బ్లాక్లో ఇద్దరు మైనర్లు, ఒక వృద్ధుడు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. మృతులు షేక్ సబ్రుల్ (11), రాణా షేక్ (11), అతుల్ మండల్ (65)గా గుర్తించారు.
Off The Record: కాంగ్రెస్ను కలవరపెడుతున్న పోలింగ్ తరువాత లెక్కలు..!
హరిశ్చంద్రాపూర్లో కూడా పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. నయన్ రాయ్ (23), ప్రియాంక సింగ్ (20) తూర్పు కుస్తారియా గ్రామంలో జనపనార తోటలో పని చేస్తూ ఉండగా పిడుగుపాటుకు మరణించారు. మరోవైపు.. అంగ్రేజ్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ భూమిలో పని చేస్తుండగా పిడుగుపాటుకు పంకజ్ మండల్ (23) అనే వ్యక్తి మృతి చెందాడు. పిడుగుపాటు ఘటనలో వధువు సహా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!