Crime News: చెరువులో మహిళల మృతదేహాలు.. పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లాలోని తాలుకా పోలీస్స్టేషన్ పరిధిలో గార్గేయపురం చెరువులో లభ్యమైన ముగ్గురు మహిళల అనుమానాస్పద మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గార్గేయపురం చెరువులో ఆదివారం ఉదయం ఇద్దరు మహిళల మృతదేహాలు, చెరువు పక్కన గుట్టు మీద మరో మహిళ మృతదేహం దొరికింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళల మృతదేహాలు కుళ్లిపోయే స్థితికి చేరుకోవడంతో అంత్యక్రియలు చేశారు.
Read Also: KKR vs SRH Qualifier 1: స్టార్ ఓపెనర్ దూరం.. హైదరాబాద్తో తలపడే కోల్కతా తుది జట్టు ఇదే!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అయితే, మృతి చెందిన ముగ్గురు మహిళల్లో ఇద్దరు మహబూబ్నగర్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిలో ఒకరు జానకి కాగా ఆమెది మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం అభంగపట్నంగా గుర్తించారు. మరో మహిళ అరుణగా గుర్తించినా ఆమె స్వస్థలంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, దగ్గరలోని పోలీసులు చెక్ చేయగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ ఆటోను గుర్తించారు. ఆటో నెంబరు సాయంతో డ్రైవర్ షేక్ మహబూబ్ బాషాను అదుపులోకి తీసుకున్నారు. ఇక, షేక్ మహబూబ్బాషాతో అరుణకు గొడవలు ఉన్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఈ నేపథ్యంలోనే అరుణను జానకిని తన ఆటోలో ఎక్కించుకుని గార్గేయపురం చెరువు దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడే వీరికి కల్లు తాపించి మద్యం మత్తులో ఉన్న వీరిని చెరువులోకి తోసేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనే ఆటో డ్రైవర్ను విచారిస్తున్నారు. ఈ కేసును మరింత లోతుగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!