Cyclone Michaung: మైచాంగ్ తుఫాను పలు రాష్ట్రాల్లో భీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా చెన్నై, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసాయి. దీనితో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరెంట్ లేక, తాగు నీరు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాగా ఈ తుఫాను కారణంగా పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా పలు చోట్ల ప్రజలు పర్ ప్రాణాలను కోల్పోయారు. ఈ వరద తాకిడి ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు కూడా తాకింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే. అల్లూరి సీతారామరాజు జిల్లా లోని.. అనంతగిరి మండలం లోని.. లవ్వ గడ్డలో తుఫాను కారణంగా వరద విలయ తాండవం చేసింది.
Read also:Chief Minister Revanth Reddy Live Updates: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం లైవ్ అప్డేట్స్
ఈ నేపథ్యంలో ముగ్గురు గిరిజనులు సమీపం లోని గోస్తిని నదిలో కొట్టుకుపోయారు. కాగా స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం నదిలో కొట్టుకు పోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మృత దేహాలను నది లో నుండి వెలికి తీశారు. కాగా ఆ మృత దేహాలు గెమ్మెలి లక్ష్మి, ఆటో డ్రైవర్ కుమార్ గా గుర్తించారు. కాగా కొట్టుకుపోయిన వారిలో మరో మహిళ మిరియాల కమల కూడా ఉంది. అయితే ఆమె మృతదేహం ఇంకా దొరకలేదు. ఈ నేపథ్యంలో కమల మృతదేహం కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.