Family Suicide Case: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఈ కేసులో పోలీసులు ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Suicide Case: కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో శనివారం ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంనకు చెందిన సుబ్బారావు చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తుండగా… శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పద్మావతి, వినయ ఇంట్లో ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులకు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. మూడెకరాల పొలం అమ్ముదామని అనుకోగా రికార్డులు తారుమారు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో రాసి ఉంది. పొలం వేరే వాళ్ల పేరుతో రికార్డుల్లో ఉందని.. రెవెన్యూ అధికారులు మోసం చేశారని, ఏమి చేయలేని స్థితిలో చనిపోతున్నట్లు వారు అందులో పేర్కొన్నారు.
Read Also: Mobile Explosion: విషాదం.. మొబైల్ పేలి నలుగురు చిన్నారులు మృతి
Also Read
ఈ కేసు గురించి డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశంలో పలు కీలక వివరాలను వెల్లడించారు. అవి ఆత్మ హత్యలు కాదు, హత్యలు అని.. భర్త సుబ్బారావు భార్య పద్మావతి, కుమార్తె వినయలకు ఇంట్లో మత్తు మందిచ్చి హత్యకు పాల్పడ్డాడని.. అనంతరం తాను వెంకట్రాద్రి ఎక్స్ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ దుర్ఘటనకు మృతుని అప్పులు, క్రికెట్ బెట్టింగ్ వ్యసనాలు కూడా ఓ కారణమని పేర్కొ్న్నారు. ప్రభుత్వ భూమి ఆన్లైన్ చేసుకొని చేతులు మారడంపై రెవెన్యూ ఉన్నతాధికారుల విచారణ సాగుతోందన్నారు. ఈ మీడియా సమావేశంలో సీఐ పురుషోత్తమరాజు, ఎస్సై మధుసూధన్ రావులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?