Bihar: చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి.. బంకాలో విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బరాహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బభంగమా గ్రామంలో గురువారం మధ్యాహ్నం చెరువులో మునిగి ముగ్గురు బాలికలు చనిపోయారు. స్నానానికి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది. గ్రామానికి చెందిన 7 ఏళ్ల కుమార్తె డోలి కుమారి, 8 ఏళ్ల కిరణ్ కుమారి, 9 ఏళ్ల బేబి కుమారి ముగ్గురూ చెరువులో స్నానానికి వెళ్లారు.
Read Also: Suriya: అందుకే సామీ.. నిన్ను దేవుడు అనేది..
Also Read
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
చెరువు ఒడ్డున బాలికల బట్టలు కనపడటంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి.. గ్రామస్తులకు తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో ముగ్గురు బాలికలను బయటకు తీశారు. కానీ అప్పటికే వారు మృతి చెందారు. అనంతరం ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: Hafiz Saeed: ముంబై దాడుల ఉగ్రవాది కుమారుడు మిస్సింగ్.. గజగజ వణుకుతున్న పాకిస్తాన్..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బంకా సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బరాహత్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు ముగ్గురు బాలికలు చెరువులో మునిగి చనిపోయారన్నారు. మృతదేహాలను అదుపులోకి తీసుకున్నామని, పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం మేరకు యూడీ కేసు నమోదు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!