Bomb Threat: పాకిస్తాన్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం.. హౌసింగ్ సొసైటీ గోడపై బెదిరింపు సందేశాలు
- పాకిస్తాన్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం
- హౌసింగ్ సొసైటీ గోడపై బెదిరింపు సందేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరపడుతున్న తరుణంలో బెదిరింపు సందేశాలు కలకలం రేపాయి. పాక్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం అని గోడలపై బెదిరింపు మెసేజ్ లు ఆందోళనకు గురిచేశాయి. బెంగళూరులో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక హౌసింగ్ సొసైటీ గోడపై రాసిన బెదిరింపు సందేశం సంచలనం సృష్టించింది. గోడపై “పాకిస్తాన్ నుంచి భారతదేశాన్ని పేల్చివేస్తాం” అని రాసి ఉంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. వెంటనే పోలీసులు, బాంబు నిర్వీర్య దళాన్ని సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో దాదాపు 300 కుటుంబాలు నివసిస్తున్నాయి.
Also Read:Poonam Bajwa : పదునైన అందాలతో రెచ్చిపోయిన పూనమ్ బజ్వా
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
బెంగళూరులోని కోడిగేహళ్లిలోని ఆల్ఫైన్ పిరమిడ్లో ఈ సంఘటన జరిగింది. స్థానిక నివాసితులు సొసైటీ గోడపై ఈ అనుమానాస్పద, రెచ్చగొట్టే సందేశాన్ని చూశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్ దర్యాప్తు ప్రారంభించింది. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Also Read:CM Revanth Reddy: రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయం..
ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని, కానీ ముందుజాగ్రత్తగా భద్రతను పెంచామని అధికారులు తెలిపారు. ఆకతాయిల పని కావచ్చు లేదా మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తి చేసిన పని కావచ్చు అని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందేశాన్ని ఎవరు, ఎప్పుడు రాశారో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!